ప్రజా సంక్షేమం కాంగ్రెస్ లక్ష్యం: రాహుల్ గాంధీ హామీలను మరచిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై నిలదీస్తాం రైతు భరోసా పాదయాత్రలో ఏ.ఐ.సి.సి ఉపాధ్యక్షుడు రాహుల్ 24 జూలై, శుక్రవారం జీవన జ్యోతి స్కూల్ విద్యార్థులతో ముచ్చటిస్తున్నరాహుల్ గాంధీ, చిరంజీవిఅనంతపురం - ఓబులదేవరచెరువు - దేశ ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని, ప్రజా సమస్యలపై నిరంతరం శ్రమించి స్వచ్చమైన పాలన అందించడం కాంగ్రెస్ కే సాధ్యమని జాతీయ కాంగ్రెస్ పార్టీ కమిటి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. శుక్రవారం రైతు భరోసాపాదయాత్ర భాగంగా మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో 1980లో నాన్నమ్మ ఇందిరా గాంధీ ప్రసంగించిన స్థలం లో మొక్కలు నాటి పాదయాత్ర ప్రారంభిచారు. మండల కేంద్రంలో పాదయాత్ర మార్గమధ్యలో Dr. అంబేద్కర్, వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలువేసి అభివాదము చేసారు. అనంతరం సభాస్తలంకు చేరుకొని రాహుల్ గాంధీ ప్రసంగించాగా ఏ.ఐ.సి.సి. రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రఘువీరా రెడ్డి అనువాద ప్రసంగం ప్రజలకు వినిపించారు. రాహుల్ గాంధీ ప్రసంగంలో బ.జే.పి. టి.డి.పీ. పార్టీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రజా సమస్యలను విస్మరించి ఇబ్బందులకు గురిచేస్తున్నారు అని అన్నారు. కేంద్రంలో బ.జే.పి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే అవినీతిని నిర్మూలిస్తామని, రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజి అందిస్తామని హామీని మరిచిన్దన్నారు.రాష్ట్రంలో సి.ఎం. చంద్రబాబు నాయుడు మహిళలకు, రైతులకు, చేనీతలకు, రునమాఫి చేస్తామని పేదప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రైతుల రునమాఫి కాకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, విదేశీ పర్యటనలు చేస్తూ వ్యవసాయ రంగాన్ని విస్మరిస్తున్నారని విమర్శిచారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళా సంఘాలు ఎంతో అభివృద్ధి చెందాయని మహిళలు ఆర్ధికంగా స్తిరబద్దరన్నారు. రాష్ట్ర టి.డి.పి. ప్రభుత్వం రైతులకు అన్యాయం చేయడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, డ్వాక్రా మహిళా రునమాఫి చేయకపోవాడంతో అధిక వడ్డీలవల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలను రాష్ట్రప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. చేనేతలకు రుణాలు మంజూరు చేయకపోవడం, గిట్టుబాటుధర కల్పించకపోవడం కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడంతో బాడిత కుటుంబాలు వీధిన పడుతున్నా ఆర్ధిక సహాయం అందించడంలో ప్రభుత్వ వైఫల్యమైన్దన్నారు. టి.డి.పి మద్దతిచ్చిన బి.జే.పి. కేంద్రంలో పాలన అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోడిని ఒప్పించి రాష్ట్రానికి ప్రత్యెక హోదా బిల్లును ఆమోదించేందుకు సి.ఎం. చంద్రబాబు ద్రుష్టి సారించాలేదన్నారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్ట్లు, రాష్ట్ర ప్రత్యెక హోదాపై ప్రతిపక్షాలు వై.సి.పి అధికార టి.డి.పి ని ఎందుకు ప్రస్నిచాలేదని, బి.జే.పి పార్టీకి భయపడుతున్నారా..? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం రైతులు అంగీకారంతో ప్రాజెక్ట్ల కొరకు భూములు తీసుకొని పరిహారం అందించేవారము అన్నారు. నిర్ణయించిన కాలం లో పరిశ్రమలు స్తాపించలేని సంస్థలు ముందుకు రాకపోతే తిరిగి రైతులకు భూములు అప్పజెప్పే ఆర్డినెన్సు ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెసే అని గుర్తు చేసారు. ప్రస్తుతం బి.జే.పి ప్రభుత్వం రైతుల అంగీకారం లేకున్నా ప్రాజెక్ట్ల కోసం స్వాధీనం చేసుకొన్న భూములను భవిష్యత్తులో ఎలాంటి కంపెనీలు/సంస్థలు నిర్మాణాలు చేపట్టకపోతే తిరిగి ఆయా భూములను రైతులకి స్వాదీనం చేయకుండా బిల్లును రూపొందించేందుకు కుయోక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా రైతులకు అవగాహన కల్పించడానికి రైతు భారోసపాదయాత్ర చేపడుతూ నానమ్మ ఇందిరా గాంధీ పర్యటించిన ఓ.డి.చెరువు ప్రాంతం లో పాద యాత్రకు చేపట్టినట్లు తెలిపారు. గత 50 ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీ దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలకు పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, ఇచిన హామీలను ప్రజా సంక్షేమం కోసం అమలుచేయడం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమన్నారు. రైతు, మహిళలు, చేనేత, అన్నివర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసాఇచ్చారు. జిల్లాలో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న ఒకొక్క కుటుంబానికి రూ. 50 వేలు చొప్పున 50 కుటుంబాలకు సభావేదికపై చెక్కులు అందించారు. అనంతరం జీవనజ్యోతి స్కూల్ విద్యార్థులతో ముచటించి, పాదయాత్ర కొనసాగించి సమీపంలో మామిల్ల కుంట్లపల్లి వద్ద వడ్డీ వారి పల్లెకు చెందిన ఎద్దుల హరినాతారెడ్డి ఆత్మహత్య చేసుకున్న కుటుంబ సభ్యులను పరామర్శించి రు. 50 వేలు చెక్కు అందించారు. డబురువారిపల్లికి చేరుకొని స్వయంసహాయక పొదుపు మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడారు. ప్రభుత్వం రునమాఫి చేస్తామని విస్మరించడంతో అధిక వడ్డీలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కొండకమర్ల గ్రామానికి చేరుకోగానే టి.డి.పి రాష్ట్ర మైనారిటీ నాయకులు అల్లాబక్షు, కార్యకర్తలు నల్లజెండాలు కట్టి నిరసన తెలిపారు. రాహుల్ గాంధీ పాదయాత్ర sc కాలనీ వరకు కొనసాగించిన తరువాత అక్కడి దళితుల మధ్యలో సహపంక్తి భోజనాలు చేసారు. జాతీయ ఉపాధి హామీ పనులు సక్రమంగా కల్పించలేక బిల్లు అందకపోవడంతో పరిసర గ్రామీణులు వందల మంది వలసవెల్లినట్లు అక్కడి ప్రజలు వాపోయారు. మాజీ ఎం.పి. చిరంజీవి రాహుల్ పాదయాత్రలో పాల్గొని సభలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిపై ధ్వజమెత్తారు. మాజీ మంత్రులు మధు యాష్కి, టి.సుబ్బిరామిరెడ్డి, బాపిరాజు, దిగ్విజై సింగ్, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, తెలంగాణ, సీమాంద్ర మాజీ ఎం.పి లు ఎం.ఎల్.ఏలు పాల్గొన్నారు. జిల్లా ఎస్.పి రాజశేఖర్ బాబు కేంద్ర రాష్ట్ర రక్షణ బలగాల సమక్షంలో భద్రతపై పర్యవేక్షించారు.