ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఘన స్వాగతం 24 జూలై, శుక్రవారంఅనంతపురం - ఓబులదేవరచెరువు - అనంతపురం జిల్లా ఓ.డి.చెరువు మండల కేంద్రం నుండి 10 కి.మీ కొండకమర్ల గ్రామం వరకు చేపట్టిన “రైతు భరోసా పాదయాత్ర” భాగంగా శుక్రవారం జాతీయ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కి కాంగ్రెస్ అగ్రశ్రేణి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ నుండి బెంగాలురుకు విమానంలూ దిగి ప్రత్యేక వాహనంలో రాహుల్ విచేయగా జిల్లా సరిహద్దు కొండికొండ చెక్ పోస్ట్కు రాష్ట్ర, కేంద్ర మాజీ ప్రతినిధులు, జిల్లా నాయకులు పుష్పగుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికారు. కూడూరు, గోరంట్ల, గౌనిపల్లె, ఓ.డి.చెరువు వరకు గ్రనంగా ఆయా నియోజకవర్గ ప్రతినిధులు స్వాగతం పలికారు. ఓ.డి.చెరువు నుండి పాదయాత్ర ప్రారంభించగా మండల కేంద్రంతో పాటు మామిల్ల కుంట్లపల్లి, డబురువారిపల్లె, కొండకమర్ల గ్రామాల్లో పాదయాత్ర చేపట్టిన రాహుల్ గాంధీకి ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొని పూలతో స్వాగతించారు. కొండకమర్ల గ్రామంలో పాదయాత్ర ముగించి ప్రత్యేకవాహనంలో 2:30కు నల్లమాడ మీదుగా పుట్టపర్తికి 3గంటలకు చేరుకోగ అడుగడుగునా ప్రజలనుండి విశేశాస్పందన కనబరచాగా రాహుల్ అభివాదాలు తెలుపుతూ సాగిపోయారు. 4 గంటలకు పుట్టపర్తిలో రాష్ట్రంలోని 175 మంది శాసనసభ, 25 మంది పార్లమెంట్ స్థానాల్లో పోటీచేసి ఓటమి చెందిన ప్రజాప్రతినిధులతో చర్చించినట్లు సమాచారం. కాగా జీవన జ్యోతి స్కూల్ విద్యార్థుల నుండి స్వాగతం అందుకున్న రాహుల్ వారితో కాసేపు ముచ్చటించారు. అనంతరం బెంగుళూరు నుండి ఢిల్లీకి విమానంలో 7 గంటలకు బయలుదేరి వెళ్తున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి టి.సుబ్బిరామిరెడ్డికి స్వల్పగాయాలు రాహుల్ గాంధీ జిల్లాలో ఓ.డి.చెరువు రైతు భారోసాయాత్ర చేపట్టగా కేంద్ర మాజీ మంత్రి టి.సుబ్బిరామిరెడ్డి పాల్గొన్నారు పాదయాత్రలో భాగంగా జీవనజ్యోతి స్కూల్లో విద్యార్థులతో రాహుల్ గాంధీ మాట్లాడుతుండగా తోపులాట జరగగా టి.సుబ్బిరామిరెడ్డి కింద పడి స్వల్పగాయాలు అయినట్టు సమాచారం.