అన్ని పార్టీ ల అంగీకారంతో విభజనపై ప్రజల్లోకి తీసుకెళతాం రాహుల్ భారోసాయాత్ర సక్సెస్ పై డి.సి.సి అధ్యక్షులు కోటా సత్యం 26 జూలై, ఆదివారంఅనంతపురం - ఓబులదేవరచెరువు - రాష్ట్ర విభజనలో యు.పి.ఏ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో టి.డి.పి, వై.ఎస్.ఆర్, సి.పి.ఐ(సి.పి.యం మినహా) బి.జే.పి పార్టీలతో పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేసి అన్ని పార్టీల అంగీకారంతో విభజనబిల్లుతో ప్రత్యేకహోదా కల్పించాలని ప్రతిపాదన చేసిన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో విలేకర్లతో తెలిపారు. మండలంలో రాహుల్ రైతుభారోసాయాత్ర లో అన్ని వర్గాల ప్రజలు స్వచ్చందంగా పెల్గొనడం తో కేంద్ర, రాష్ట్రాల్లో బి.జే.పి, టి.డి.పి వైఫల్యాల కారణంగా ప్రజలు కాంగ్రెస్ పై అభిమానం చుపుతున్నరన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వాల వైఖరిపై కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా వుండి అధికార పార్టీని ఎండగాడతామన్నారు. రాహుల్ పాదయాత్రకు అధిక సంఖ్యలో తరలివచిన ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాన కార్యదర్శి మణిగె మనోహర్ నాయుడు, సహాయ కార్యదర్శి చంద్రశేఖర్ గుప్త, కన్వీనర్ రవీంద్ర నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.