రాహుల్ గాంధీ సందర్శించనున్న పోస్టర్
అనంతపురం - ఓబులదేవరచెరువు - అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఈ నెల 24న అనంతపురం జిల్లా ఓ.డి.చెర్వు, నల్లమాడ మండలాల్లో పర్యటించనున్నట్లు రాష్ట్ర పి సి సి అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి "విజయస్వప్నం.నెట్" అతినిదికి తెలిపారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లా కావడంతో ఓ.డి.చెర్వు, నల్లమాడ ప్రాంతాల్లో రాహుల్ గాంధీ పాదయాత్ర ౧౭ కీ.మీ పరిధిలోని రైతులు, మహిళలు, యువత, అన్నివర్గాల సమస్యలు తెలుసుకుని పార్లమెంటులో గళం వినిపించేందుకు పర్యతిస్తున్నట్లు ఆయనతెలిపారు. రాహుల్ గాంధీ పర్యటనలో భాగంగా 17 కీ.మీ పరిధిలో మూడు సమావేశాలు నిర్వహించేందుకు రూట్ మ్యాప్ ఏర్పాట్లు పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ పర్యటనలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్ర్భంగా పిలుపినిచ్చారు. ఆయన వెంట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొతాసత్యం, మాజీ ఎం.ఎల్.సీ నాగారాజారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కొమ్ము భాస్కర్, ప్రధాన కార్యదర్శి మణిగే మనోహర్ నాయుడు, మండల కన్వీనర్లు గౌస్ సాబ్, యర్రమనేని రవీంద్ర నాయుడు, కార్యకర్తలు గంగాధర్ నాయుడు, అమర్, చాంద్ బాష, హరీష్, శేషు, లక్ష్మి పతి నాయుడు, చంద్రమౌళి, తదితరులు ఉన్నారు.
ప్రతిభ ఉన్న విద్యార్తినీల చదువులకు పేదరికం అడ్డు ఓ.డి.చెర్వు: మండల పరిధిలోని తుమ్మల కుంట్లపల్లి గ్రామా ప్రభుత్వ జిల్లా ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి చదివిన విధ్యార్తినీలు పి.ఫరీదా,9.0 పి.సిమ్రాన్ 9.5 పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించినా ఉన్నత చదువులకు పేదరికం అడ్డుకావడంతో కూలి పనులుకు పరిమితమైతున్నట్లు కుటుంబీకులు ఆవేదన వ్యక్త పరుస్తున్నారు. పి.సిమ్రాన్ 9.5 గ్రేడు సాధించిన తల్లి ఫరూఖ్ భీ తండ్రి హమీద్ ఖాన్ లు వలస వెళ్లి కూలి పనులు చేసుకోవడంతో అవ్వ వద్ద ఉంటున్నట్లు తెలిపారు. పి.ఫరీదా 9.0 గ్రేడు సాధించిన విద్యార్థిని తండ్రి ఏడేళ్ళ క్రితం అనారోగ్యంతో మరణించగా తల్లి రహ్మత్ భీ పాఠశాలలో హేల్పెర్ గా కూలి చేస్తూ 10 వ తరగతి వరకు చదివించింది అన్నారు. ఇద్దరు విద్యార్దినీలు ఉన్నత చదువులు అభ్యసించాలి శ్రద్ధ వున్నా చదువుల తల్లికి లక్ష్మీ కటాక్షం కరువు కావడంతో పేదరికం తో చదువులు కొనసాగించలేకపోతుండడంతో స్వచందసంస్థలు మున్డుకోచి ఆర్ధిక సహాయం అందించాలని కోరుతున్నారు.