ప్రజా సమస్యల పై అధికారులు స్పందించాలి ప్రజాసదస్సులో మంత్రి పల్లె 11 జూలై, శనివారం సదస్సులో ప్రసంగిస్తున్న మంత్రి పల్లె అనంతపురం - ఓబులదేవరచెరువు - నల్లమాడ, ఆమడగూరు, ఓ.డి.చెరువు మండలాలలో వుండి ప్రజలసమస్యలపై స్పందించి పరిష్కరించాలని ఐ.టి సమాచార మైనారిటి శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సూచించారు. శనివారం ప్రజాసదస్సు కార్యక్రమములో భాగంగా మండలానికి ముఖ్య అతిధిగా విచ్చేసి ఆయన మాట్లాడారు. గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నందున ప్రభుత్వం అధికంగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. బోర్లు, పైపులైన్లు, మోటర్ మరమ్మతులు త్వరితగతి చేపట్టాలన్నారు. ఫించన్లు, రేషన్ కార్డులు, పట్టాదారు పాసుపుస్తాకాలు పంపినిలో అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని అసహనం వ్యక్తంచేశారు. అర్హులైన వారి ప్రభుత్వ సంక్షేమపతకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో వుండాలన్నారు. హంద్రినీవా ద్వారా జిల్లా రైతాంగం ఇబ్బందులు తీరుతాయని ఆశాభావం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ. రాజశేఖర్, తహశిల్దార్లు, ఎం.పి.డి.ఓ లు, హౌసింగ్, ఇ.సి.డీ.ఎస్, ఎన్.ఆర్.జి.ఎస్, ఫారెస్ట్, హెల్త్, సిరికల్చర్, ఆర్.డబ్లూ.ఎస్, పోలీస్, బ్యాంకు, పశువైద్య శాఖ, ఐ.కె,పి(వెలుగు), లైబ్రరి, అగ్రికల్చర్, తదితర శాఖాధికారులు, జెడ్డ్పితిసి పిట్ట ఓబులరెడ్డి, యం.పీ.పీ.ఇస్మాయిల్, ఉపాధ్యక్షురాలు ఇందిరమ్మ, మండల కన్వీనర్ లక్కినేని రామానాయుడు, సర్పంచులు రంగారెడ్డి, కవిత, బిందుమాధవి, నాగిరెడ్డి, యం.పీ.టీ.సీలు శంకర్ నాయుడు , ఉషారాణి, గంగెన్న, తులసిభాయి, తదితరులు పాల్గొన్నారు.నేలపై కూర్చొని వామపక్షాల తో చర్చిస్తున్న మంత్రి పల్లె వామపక్షాల మధ్య వినతులు స్వీకరించిన మంత్రి పల్లె ప్రజాసదస్సులో పాల్గొని మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రసంగిస్తుండగా మండల సి.పి.యం, సి.పి.ఐ(వామపక్షాలు) నాయకులు రమణ, శ్రీరాములు, అంజి, మున్నా, చలపతి, రామచంద్రలు ప్రజా సమస్యలపై స్పందిన్చాలంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలుపడంతో మంత్రి పల్లె వామ పక్ష నాయకులు, సుందరయ్య కాలని వాసుల మధ్య నేల పైన కూర్చొని ఫించన్లు, రేషన్ కార్డ్ , మహిళారుణ మాఫీ, తాగునీరు, గృహ పట్టాలు, భూపంపిణి, గ్రామీణప్రాంతాల్లో మౌళిక సదుపాయాల కల్పనకోసం వినతులు అందజేయగా సంభందిత అధికారులతో పరిష్కరించారు.