ధోబి ఘాట్ నిర్మించాలని వినూత్న నిరసన 18 ఆగస్టు, మంగళవారం కార్యాలయం ముందు మహిళలు బట్టలు ఉతుకుతూ వినూత్నంగా నిరసనఅనంతపురం - ఓబులదేవరచెరువు - మండలంలోని గాజుకుంటపల్లి కి చెందిన రజక కుటుంబీకులు సోమవారం సి.పి.యం ఆధ్వర్యం లో ధోబి ఘాట్ నిర్మించాలని తహసిల్దార్ కార్యాలయం ముందు మహిళలు బట్టలు ఉతుకుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. సి.పి.యం నాయకులు రమణ, శ్రీరాములు, నారాయణ, వెంకటేష్, చంద్ బాష, షబ్బీర్, శ్రీనివాసులు రజక కుటుంబీకులు రాము, రెడ్డప్ప, పుల్లప్ప రాజిత, రెడ్డమ్మలు మాట్లాడుతూ వర్షాలు లేక వాగులు వంకల్లో నీళ్ళు లేక పోవడంతో కుల వృత్తితో జీవనానికి కుంటు పడిందన్నారు. గత రెండేళ్ళ నుంచి బోరు మంజూరు చేసి ధోభిఘాట్ ఏర్పాటు చేయాలని పలుమార్లు అధికార్లకు, పాలకులకు మోరపెట్టుకున్నా పట్టికున్న నాధుడే లేరన్నారు. కరువు పరిస్థితిలో దుర్బర జీవనాం గడుపుతూ వలసలు వెళ్ళే పరిస్థితి దాపురించిందన్నారు. ఇప్పటికైనా కాలగర్బంలో కలిసి పోతున్న కుల వృత్తులదారులకు చేయూతనివ్వాలన్నారు. ధోభీఘాట్లు పైపులైన్లు మంజూరు చేయాలని డి.టి మహబూబ్ పీరాకు వినతిపత్రం అందజేశారు.