శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం పిబ్రవరి 5న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల రాక 30 జనవరి, మంగళవారం - మడకశిరలో భారీ ర్యాలీ, బహిరంగ సభ స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంబించిన రాజీవ్ పల్లెబాట కార్యక్రమం మడకశిర నుంచి ప్రారంభం కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమం విజయవంతం చేయాలని మాజీ మంత్రి ఎన్.రఘవీరారెడ్డి పిలుపునిచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఓప్రకటనలో పేర్కొన్నారు(విజయస్వప్నం ప్రతినిధి,శ్రీసత్యసాయిజిల్లా) వైసీపీని వీడి టిడిపిలో పలువురు చేరిక శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని ఓడిచెరువు మండలం,వెంకటాపురం పంచాయతీ నల్లగుట్లపల్లి గ్రామానికి చెందిన వైకాపా బిసి కుటుంబాలకు చెందిన పలువురు మంగళవారం మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యలో మంగళవారం పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో తెదేపాలో చేరారు.ఈ సందర్బంగా మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వారికి కండువాలు కప్పి టిడిపిలోకి ఆహ్వానించారు.వారికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా అండదండలు అందిస్తామని,బీసీల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేస్తోందని,బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొచ్చి వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు.వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో మంజునాథ,ఎల్ఎల్బి. మునీంద్ర,వెంకటరమణ,క్రిష్టప్ప,శ్రీనివాసులు,రామప్ప,వెంకటేష్,సురేంద్ర,రామన్న,ఆంజనేయులు,వెంకటరమణ తదితరులు ఉన్నారు.పుట్టపర్తి నియోజకవర్గ ఇన్చార్జి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో టిడిపిలో చేరినట్లు మండల కన్వీనర్ జయచంద్ర,వెంకటాపురం సర్పంచ్ శంకర్ రెడ్డి,ఎంపీటీసీ శ్రీనివాసులు,క్లస్టర్ ఇంచార్జ్ నారపరెడ్డి,సీనియర్ నాయకులు ఆంజనేయులు,రామిరెడ్డి, రఘునాథ్ రెడ్డి తదితర తెదేపా శ్రేణులు తెలిపారు(విజయస్వప్నం.నెట్, పుట్టపర్తి/ఓడిచెరువు)