బిసిల ఐక్యతతో రాజ్యాధికారం బిసి మహా సమ్మేళనసభలో వ్యక్తులు 9 ఆగస్టు, ఆదివారం అనంతపురం - కదిరి - ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనారిటీ బడుగుబలహీన వర్గాల ఐక్యతతో రాజ్యాధికారం సాధ్యమని రాష్ట్ర బిసీ సంక్షేమ సంఘం నాయకులు యల్లప్ప స్వామి, కడలి చింతారావు, శ్రీధర్, వెంకటేశ్వర్లు, నాగభూషణంలు పేర్కొన్నారు. ఆదివారం కదిరి పట్టణంలో బాలికల కళాశాలలో "బిసీ మహా సమ్మేళనసభలో రాష్ట్ర అధ్యక్షులు అంపాపతివి గోవిందు అధ్యక్షతన సమావేశము నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎం.పి.నిమ్మల క్రిష్టప్ప ముఖ్యాతిడిగా విచ్చేశారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు బిసీ సంక్షేమ అవగాహన సదస్సు కార్యక్రమాలతో గ్రామస్థాయి నుండి చైతన్యం తీసుకురావాలన్నారు. దళిత, గిరిజన, బడుగులు, మైనారిటీలు ఐక్యతతో ముందుకెళితే రాజ్యాధికారం సాధ్యమని పలువురు వ్యక్తులు పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండి బడుగు బలహీనవర్గాల ప్రజలతో బలమైన రెండు సామాజిక వర్గాలు రాజకీయంగా లబ్ధి పొందుతున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్స్తీ, బీసీ, మైనారిటీ ఓట్లతో రెండు బలమైన సామాజిక కులాల ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో లబ్దిపొందుతున్నారన్నారు. రాష్ట్రపాలనలో ఏడూ దశాబ్దాల కాలంలో బడుగు బలహీన వర్గాల వారి సంక్షేమానికి ఎలాంటి శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టలేదన్నారు. ఎస్సే,ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలు 70% వుండగా, రెండు బలమైన సామాజిక వర్గాల శాతం కేవలం 25% ఉండగా బీసీ వర్గాలను రాజకీయలబ్దికోసం ఎన్నికల్లో జెండాలు మోయడానికి అధికారం చేపట్టిన తరువార వెనక్కునేట్టి వెట్టి చాకిరి చేయించడం యధాప్రకారంగా కొనసాగుతోందన్నారు. బీసీ ఐక్యతతో రాజ్యాధికారం సాధించేందుకు ప్రతిఒక్కరు పార్టీలకు అతీతంగా కదలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం 15 మండలాలకు చెందినా ప్రభుత్వ పాఠశాలలో పదవతరగతిలో ఉత్తరమ ఫలితాలు సాధించిన 131 మంది బడుగు బలహీన వర్గ విద్యార్ధులకు నగదు బహుమతులు హిందూపురం పార్లమంట్ సభ్యులు నిమ్మల క్రిష్టప్ప బిసీ ఉద్యోగులు ప్రజాప్రతినిధులు అందజేశారు. కర్నూలు, కడప, చత్తూరు, గుంటూరు, విజయనగరం రాష్ట్రస్ధాయి నాయకులు శంకర్ గౌడ్, లక్ష్మన్, యల్లరాజు, భూషణ్ రావు, పార్వతమ్మ, మునయ్య, అగీశం ప్రతాప్, శ్రీరాములు నాయుడు, రామారావ్, వెంకటప్ప నాయుడు, శ్రీరాములు నాయక్, కర్నూల్ హేమ, అర్.టి.సి. రమణ, శంకరప్ప, మొహమ్మద్ అలీ, హిందూపురం పార్వతమ్మ, అగీశం రంగనాథ్ తదితరులు పాల్గొనగా వందలాదిమంది సభకు విచ్చేశారు. ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం మండలంలోనే కస్తురిభాయి పాఠశాలలో ఆదివారం టి.ఎస్.ఎఫ్ మండల నాయకులు గోపాల్ నాయక్, రాజశేఖర్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని కేకు కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్.పి.టి.సి పిట్టా ఓబులరెడ్డి, ఎం.పి.పి ఇస్మాయిల్ ఎ.ఎస్.ఐ ఇస్మాయిల్ ఖాన్ ముఖ్య అథిదులుగా ఆదివాసుల స్థితిగతులపై, ప్రాధాన్యత అంశాల పై విద్యార్థులకి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్ది సంఘ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయినీలు, సిబ్బంది పాల్గొన్నారు.