లంచం తీసుకొంటు ఏసీబిపట్టుబడిన ఆర్ఐ 28 ఫిబ్రవరి, బుధవారం అనంతపురం - శ్రీసత్యసాయిజిల్లా/అనంతపురం ఫిబ్రవరి27 - అనంతపురంజిల్లా పామిడి మండల తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.పామిడి మండలంలోని అనుంపల్లి గ్రామానికి చెందిన శేషాద్రి అనే రైతు ల్యాండ్ ముటేషన్ పట్టా పుస్తకం కొరకు దరఖాస్తు చేసుకున్నాడని, అయితే ల్యాండ్ మోటివేషన్ చేయాలంటే 10 వేలు లంచం ఇవ్వాలని ఆర్ఐ క్రాంతి కుమార్ రైతును డిమాండ్ చేశాడని, దీంతో రైతు 6వేల రూపాయలకు బేరం కుదుర్చుకుని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడని ఏసీబి డిఎస్పి వేంకటాద్రి తెలిపారు. దీంతో ఆర్ ఐ క్రాంతి కుమార్ రైతు నుండి 6వేలు రూపాయలు లంచం తీసుకుంటుండగా మాటువేసి ఆర్ ఐ క్రాంతి కుమార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని తెలిపారు. ఆర్ఐ వద్ద నుండి 6వేల రూపాయలను స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేసి ఏసిపి కోర్టు లో హాజరు పరుస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.