ఫ్లాష్.... ఫ్లాష్....!! తెదేపా సీనియర్ నాయకులు బోయపాటి రామప్పనాయుడు మృతి 30 జనవరి, మంగళవారం - ఓడిచెరువు మండలంలో చింతమానిపల్లి పంచాయతీ నాయనివారిపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ,మాజీ కదిరి మార్కెట్ చైర్మన్,మాజీ రాష్ట్ర రైతు సంఘ నాయకులు బోయపాటి రామప్ప నాయుడు మంగళవారం రాత్రి మృతి చెందినట్లు తెదేపా నాయకులు తెలిపారు.బోయపాటి రామప్పనాయుడు పార్థ దేహాన్ని అనంతపురం నుండి వారి స్వగ్రామం నాయనవారిపల్లికి తరలిస్తున్నట్లు రాత్రి తెదేపా నాయకులు అందించిన సమాచారం.సీనియర్ నాయకులు బోయపాటి రామప్ప నాయుడు మృతి పట్ల తెదేపా శ్రేణులతోపాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.