అయ్యప్పస్వామి దీక్షలు -భక్తులకు మోక్షమార్గాలు 2 డిసెంబరు, శనివారం - ఓబుళదేవరచెరువు : అయ్యప్పస్వామివారి మాలధారణ చేసి 41 రోజులు త్రికర్ణ సిద్ధితో దీక్షలు చేపడితే భక్తులకు మోక్షమార్గం సిద్దిస్తుందని శబరిమల అయ్యప్పస్వామివారి సన్నిధానం మేల్ తాంత్రీ ఐదుగురు (ప్రధాన అర్చకులు)పేర్కొన్నారు. శుక్రవారం శ్రీధర్మశాస్త అయ్యప్పస్వామివారి దేవస్థానంలో కేరళ సంప్రదాయం మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించారని ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు తెలిపారు. శ్రీధర్మశాస్త అయ్యప్పస్వామి వారి దేవస్థానం దిన దిన అభివృద్ధిగా యుగాల పాటు వర్ధిల్లు తొందని, ప్రతి ఒక్కరు మణికంఠస్వామి మాలధారణ చేసి నియమాలు పాటిస్తూ 41రోజులు దీక్షలు వ్రతాలు నిర్వహించి మోక్షం పొందాలని అయన కోరారు. శ్రీఈశ్వరిమాత ఆలయ నిర్మాణ భూమిపూజ ఓబుళదేవరచెరువు : మండల కేంద్రానికి అతి సమీపంలో ఎం.కొత్తపల్లి బంగారు బండపై వెలసిన శ్రీధర్మశాస్త అయ్యప్పస్వామివారి దేవస్థానం ఆవరణలో శనివారం కార్తీక బహుళ పంచమి పురస్కరించుకొని దాత కుసుమవారిపల్లి అమ్మవారి పూజారి రమణప్పస్వామి ఆధ్వర్యంలో శ్రీపోటులూరి వీరబ్రహ్మంస్వామి ముని మనవరాలు ఈశ్వరిమాతదేవి ఉపాలయం నిర్మాణం కోసం పూజారి పంచరత్న సురేష్ శర్మ చేతుల మీదుగా భూమిపూజ నిర్వహించిన్నట్లు ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు తెలిపారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.... శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి వారి దేవస్థానం ఆవరణలో 101"దేవతమూర్తుల ఉపాలయాలు నిర్మాణంలో భాగంగా దాత కుసుమవారిపల్లి ఈశ్వరిమాత ఆలయ పూజారి రమణప్పస్వామి సహాయసహకారాలతో శ్రీ ఈశ్వరిమాత ఉపాలయానికి భూమిపూజ భక్తిశ్రద్దలతో నిర్వహించిన్నట్లు తెలిపారు.పూజా కార్యక్రమంలో విలేకరి శ్రీనివాసులు దంపతులు పాల్గొన్నారని, ఆలయ నిర్మాణం కోసం 100 ఇటుకలు అందించినట్లు తెలిపారు. వైభవంగా శ్రీలక్ష్మినరసింహస్వామి విగ్రహప్రతిష్ట ఓబుళదేవరచెరువు(ఫోకస్ అనంత)మండల కేంద్రానికి అతి సమీపంలో ఎం.కొత్తపల్లి బంగారు బండపై వెలసిన శ్రీధర్మశాస్త అయ్యప్పస్వామివారి దేవస్థానం ఆవరణలో కార్తీక బహుళ పంచమి పురస్కరించుకొని వడ్డివారిపల్లి గ్రామానికి చెందిన దాత బొమ్మిరెడ్డి ఉత్తమరెడ్డి కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో వేద పురోహిత పూజారి పంచరత్న సురేష్ శర్మ మంత్రోచ్చరణాలతో శ్రీలక్ష్మినరసింహస్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా నిర్వహించినట్లు ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు తెలిపారు.అయన ఈసందర్బంగా మాట్లాడుతూ.... శ్రీధర్మశాస్త అయ్యప్పస్వామివారి 11వ ఆలయ స్థాపన వార్షికోత్సవాలు పురస్కరించుకొని 101 దేవతమూర్తుల ఉపాలయాల నిర్మాణంలో భాగంగా దాత బొమ్మిరెడ్డి ఉత్తమరెడ్డి కుటుంబ సభ్యులు వంతు సహాయ సహకారాలతో శ్రీలక్ష్మినరసింహస్వామి ఉపాలయం నిర్మించి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించగా ఎస్ఐ బి. మల్లికార్జునరెడ్డి విచ్చేసి పూజలు నిర్వహించినట్లు తెలిపారు.ముందుగా శ్రీధర్మశాస్త అయ్యప్పస్వామివారి ఆలయంలో శ్రీలక్ష్మినరసింహస్వామి విగ్రహానికి అభిషేకాలు,అర్చన వివిధ రకాల పూజలు నిర్వహించి, పంచ లోహలు, పగడాలు సమర్పంచి అంగరంగ వైభవంగా విగ్రహప్రతిష్ట చేపట్టి, వందలాది మంది గ్రామస్తులకు, భక్తులకు అన్నతీర్థ ప్రసాదాలు అందించారు. అలాగే బొమ్మిరెడ్డి ఉత్తమరెడ్డి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 370 మంది అయ్యప్పభక్తులకు అన్నదానం బిక్ష ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. Click for more pics >>