40వరోజు అయ్యప్ప భక్తులకు అన్నదానం 26 డిసెంబరు, మంగళవారం అనంతపురం - ఓబుళదేవరచెరువు డిసెంబర్ 26 - మండల కేంద్రానికి అతి సమీపంలో ఎం.కొత్తపల్లి బంగారు బండపై వెలసిన శ్రీధర్మశాస్త అయ్యప్పస్వామి ఆలయంలో 40వరోజు మంగళవారం ఫోటో స్టూడియో హరి కుటుంబ సభ్యులతో కలసి దాదాపుగా 340మంది అయ్యప్పస్వామి మాలధారణ భక్తులకు అన్నదానం భిక్ష సౌకర్యం కల్పించినట్లు ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు తెలిపారు.ముందుగా శ్రీ అయ్యప్పస్వామివారికి పూజలు నిర్వహించి అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నదానం సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.ప్రతి యేటా శాశ్వత అన్నదాతలు మాలధారణ భక్తులకు అన్నదానం సౌకర్యం కల్పించడం శుభపరిణామమని, ఆలయంలో బిక్ష పెట్టేందుకు అవకాశం కల్పించిన ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడుకు దాతలు ధన్యవాదములు తెలిపారు. మూడు కేంద్రాలలో ఘనంగా ఆడుదాం ఆంధ్ర ఓబుళదేవరచెరువు డిసెంబర్ 26(విజయస్వప్నం)మండల పరిధిలోని ఓడిసి, కొండకమార్ల, తంగేడుకుంట మూడు కేంద్రాలలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమము ప్రజా ప్రతినిధులు,అధికారులు, విద్యార్థులు ఘనంగా ప్రారంభించారు. ఓడిసీ కేంద్రములో క్రికెట్, కొండకమార్ల కేంద్రములో వాలీబాల్, తంగేడుకుంట కేంద్రములో కబడ్డీ ఆటలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ తుమ్మల పర్వీన్ భాను, జెడ్పీటీసీ దామోదరరెడ్డి,స్పెషల్ ఆఫీసర్ రమేష్ బాబు,తహసిల్దార్ రామనాథరెడ్డి,సర్పంచులు గోవింద్,అభిధా రఫీ, మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీనివాసరెడ్డి, మండల అగ్రి అడ్వాసరీ చైర్మన్ లక్ష్మిరెడ్డి, గోవర్ధన రెడ్డి,రఫీ, భాస్కరరెడ్డి,ఎంపీటీసీ రమనప్ప, ఎంఈఓ రమణా, ఈఓఅర్డి రాజశేఖర్, ఆర్ఐ నాగేంద్ర, స్కూల్ కమిటీ చైర్మన్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.