కుల ధృవీకరణ పత్రాల కోసం అగచాట్లు 4 ఆగస్టు, మంగళవారం అనంతపురం - ఓబులదేవరచెరువు - మండల తహసిల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ సాంకేతిక లోపం కారణంతో గత నలగురోజులనుంచి కుల ధృవీకరణ, రైతు పాసుపుస్తాకాల సవరణ, విద్యార్థుల కుల ఆదాయ తదితర ధృవీకరణకోసం వచ్చి అగచాట్లు పడుతున్నట్లు పెరుకొన్నారు. బ్యాంకు రుణాల కొరకు ఎస్.సి, ఎస్.టి, బీసి, మైనారిటీ తదితర లోనుల దరకాస్తుల కొరకు ధృవీకరణ పత్రాలు పొందుపరచాలన్నారు. అయితే ముగింపు గడువు కారణంగా అర్హత కోల్పోతామని పలువురు వాపోతున్నారు. అధికారులు స్పందిచి దరకాస్తు గడువును పొడిగించాల్సిందిగా కోరుతున్నారు.