కాలనీ వాసులకు ఇళ్ళపట్టాలు పంపిణి చేయాలి సి.ఫై.ఎం, సి.ఫై.ఐ ధర్నా 3 ఆగస్టు, సోమవారం అనంతపురం - ఓబులదేవరచెరువు - మండల పరిధిలోని గాజుకుంట్లపల్లె సమీపంలో సుందరయ్య కాలనీ వాసులకు ఇళ్ళపట్టాలు పంపిణి చేయాలని సోమవారం సి.ఫై.ఎం, సి.ఫై.ఐ మండల నాయకులు శ్రీరాములు, నారాయణ, మున్నా, పూల శ్రీనివాసు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ముందుగా కాలనీ వాసులు ర్యాలీగా తహశీల్దారు కార్యాలయానికి చేరుకొని నినాదాలు చేస్తూ బైఠాయించారు. అనంతరం వామపక్షాల నాయకులు మాట్లాడుతూ.. మండల కేంద్రంలో గుడారాలల్లో దుర్భర పరిస్థితుల్లో కాలం గడుపుతున్న సంచార కులవృత్తుదారులకు దాదాపుగా 96 కుటుంబాలకు గాజుకుంట్లపల్లె సమీపంలో ప్రభుత్వ పోరంబోకు భూమిలో కాపురాలు ఉన్నామని దృవీకరించారు. అయితే రెండేళ్ళ క్రితం ప్రభుత్వ పోరంబోకు 2 1/2 ఎకరాల్లో పేద సంచారకులాల వారు గుడిసెలు, పాకలు వేసుకుని జీవనం సాగిస్తున్నా అధికారులు శాశ్వత నివాస ఇళ్ళ పట్టాలు మంజూరు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఇళ్ళ పట్టాలు పంపిణి చేయాలని డిమాండ్ చేసారు. పేదప్రజలకు ఇళ్ళ పట్టాల పంపినిలో జాప్యం చేస్తే ఉద్యమాలు ఉదృతంగా ఉంటాయని హెచ్చరించారు. హైదర్ వల్లి, షబ్బీర్, చాంద్ బాష, వెంకటేష్, కాంతమ్మ, తదితరులు పాల్గొన్నారు. వెంకటాపురంలో డెంగీ జ్వరాలు? మండలంలోని వెంకటాపురం పంచాయితీ పరిధిలో నల్లగుట్టపల్లిలో డెంగీ జ్వరాలు వున్నట్లు గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందినా కృష్ణారెడ్డి కుమారుడు హర్షవర్ధన్ బాబు 5 సం||రాల బాలుడికి జ్వరం రావడంతో పరీక్షలు నిర్వహించగా డెంగీ జ్వరం లక్షణాలు వున్నట్లు తెలియడంతో బట్టలపల్లి ఆసుపత్రిలో చికిస్త్సలు చేయిస్తున్నారు గ్రామంలో హెల్త్ క్యాంపు నిర్వహించాలని గ్రామస్థులు కోరుతున్నారు.