ర్యాగింగ్ విద్యార్ధి మృతికి కారకులైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి అఖిలభారత ST, SC, BC ఐక్యవేదిక గిరిజన, స్ఫీ, ఐస్ఫ్ విద్యార్ధి సంఘాల నిరసనలు 2 ఆగస్టు, ఆదివారం అనంతపురం - ఓబులదేవరచెరువు - నెల్లూరు గాయత్రి జూనియర్ కళాశాల యాజమాన్య నిర్లక్ష్య వైఖరికి మనస్తాపం చెంది ఉరి వేరుకున్న కే.మధువర్ధన్ రెడ్డి మృతికి కారకులైన యాజమాన్యం పై కఠినమైన చర్యలు తీసుకోవాలని శనివారం మండల కేంద్రంలో కదిరి, హిందూపురం రహదారిపై అఖిలభారత SC, ST, BC ఐక్యవిధ్యర్తి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసుల నాయక ఆధ్వర్యంలో విజ్ఞాన్, S.V.B.G కాలేజీ విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. గుంటూరు విశ్వవిద్యాలయంలో విద్యార్థిని రిశితేస్వరి ర్యాగింగ్ కారణంగా మృతి చెందినా వారం రోజుల్లోనే మండలానికి చెందినా విద్యార్ధి కే.మధువర్ధన్ రెడ్డి ర్యాగింగ్ వాళ్ళ ఆత్మాహత్య చేసుకున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. మృతిచెందిన విద్యార్థి కుటుంబాలకు 20లక్షలు ఆర్ధిక సాయమందించి కళాశాలను రద్దుచేసి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి డివిజన్ నాయకుడు బాలాజీ నాయక్, ఆనంద్ నాయక్, ఇంతియాజ్, చంద్రా నాయక్, తదితరులు పాల్గొని అధికారులకు వినతి పత్రం అందించారు. కదిరి లో ధర్నా కదిరి పట్టణంలో వేమారెడ్డి సర్కిల్ వద్ద శనివారం, దొన్నికోటవారి పల్లెకు చెందిన ఆత్మహత్య చేసుకున్న మధువర్ధన్ రెడ్డి తల్లిదండ్రులు ఆనంద్ రెడ్డి, రాజమ్మ బంధువులు రమణ రెడ్డి, రఘునాథ రెడ్డిలతో 150 మంది గ్రామస్థులు కదిరి పట్టాన SFI అఖిలభారత ST, SC, BC ఐక్యవేదిక, AISF, గిరిజన సంఘాల నాయకులూ శ్రీనివాస నాయక్, కుమార్ నాయుడు ఆధ్వర్యంలో 4 గంటలపాటు అనంతపురం-తిరుపతి ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ర్యాగింగుకు గురై విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సి.యం చంద్రబాబు ప్రేక్షక పాత్ర వహిస్తూ కాలేజీ యాజమాన్యం కు దాసూహం చేస్తున్నారని విమర్శించారు. RDO రాజశేఖర్ న్యాయం చేస్తామన్నారు. కదిరి డివిజన్ పరిపాలక అధికారి రియజుద్దిన్ కు వినతి పత్రం అందించారు.