ఆగష్టు 1 నుండి హైదరాబాద్ లో కొత్త ప్లాస్టిక్ నిభందనలు అమలు 12 జూలై, మంగళవారం హైదరాబాద్ - వార్త - తెలంగాణ రాష్ట్రం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ( TSPCB ) మరియు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( జీహెచ్ఎంసీ ) ఆద్వర్యంలో ప్లాస్టిక్ సంచుల తయారీ మరియు వినియోగ వ్యయాన్ని పెంచేందుకు ఆగష్టు 1 నుండి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, 2016, అనే ప్రణాళికను అమలు చేయనున్నారు. ఇప్పటికే నగరంలో 200 కి పైగా అక్రమ తయారీ యూనిట్లు ఉన్నాయి అయితే, 50 మైక్రాన్లకన్నా తక్కువఉన్న ప్లాస్టిక్ సంచులపై నిషేధం పాక్షికం అని పిసిబి చెప్పారు. 50 మైక్రాన్లకన్నా తక్కువఉన్న ప్లాస్టిక్ సంచుల తయారీదారులు మరియు అమ్మకందారులపై పెనాల్టీ ఉంటుంది కానీ పూర్తిగా నిషేధంచడం లేదని, అలాగే వ్యర్థపదార్దాలు ఉపయోగించంలో వినియోగదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది తమ ముఖ్య ఉద్దేశమని అధికారులు చెప్పారు. తమ ఉద్దేశం వినియోగదారులలో అవగాహన కోసమే కాని, పూర్తిగా నిషేధించడం కాదని తెలిపారు. ఇది వరకు 20 నుంచి 30 మైక్రాన్లు ఉన్న సంచులను ఉచితంగా ఇచ్చేవారు, కానీ ఇప్పుడు 50 మైక్రాన్లకన్నా తక్కువఉన్న ప్లాస్టిక్ సంచులను అనుమతించకపోవడంతో ఈ సంచులపైన కొంత ధర విధించవలసి వస్తుంది. అలా డబ్బు చల్లించిన సంచులని వినియోగదారులు పారేయడానికి ఆలోచిస్తారు. ఇది వరకు 40 మైక్రాన్లు వరకు పరిమితి ఉన్నది కాని ఇప్పుడు 50 మైక్రాన్లకు పెరిగింది, అందువల్ల ప్లాస్టిక్ సంచుల ధర కూడా పెరుగుతుంది అని ఎన్ రవీందర్, సీనియర్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్, TSPCB చెప్పారు. విధించబడే జరిమానాలు గురించి అధికారి మాట్లాడుతూ, జరిమానాల విధానం సిధ్దమైంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయవలసి ఉంది, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సిద్ధం చేసిన ప్రతిపాదనను GHMC ఆమోదంచవలసి ఉంది. "గృహాలు లేదా తయారీ మూలాల నుండి వచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వేస్ట్ పికర్స్, రీసైక్లింగ్, వేస్ట్ ప్రాసెసర్లుతో ప్లాస్టిక్ వాడకాన్ని తాగ్గీంచడమే" ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ యెక్క ముఖ్య ఉద్దేశ్యము అని చెప్పారు.