వర్షాలకి నేలకూలిన ఇంటిగోడలు 21 ఆగస్టు, శుక్రవారం కూలిపోయిన ఇంటి ముందు బాధిత కుటుంబీకులుఅనంతపురం - ఓబులదేవరచెరువు - మండలంలో గురువారం రాత్రి కురిసిన వర్షాలకు మిట్టపల్లి కొత్తకాలనిలో నీరు వృద్దుతంగా ప్రవహించడంతో వై. బాసుపీర, మున్ని, ఇళ్ళలోకి నీరు చేరడంతో గోడలు కుప్పకూలాయి. వీద్యుత్ సీరఫరా లేకపోవడంతో ఉన్నపళంగా నిరు ఇంటిలోకి చేరడంతో భయాందోళనలతో ముగురు పిల్లలతో అరచేతిలో ప్రాణాలు పట్టుకొని పరుగులు తీసినట్లు తెలిపారు. మూడడుగుల నీరు ఇళ్ళలోకి చేరడంతో ఆహార్య ధాన్యాలతో పాటు, వంట సామాగ్రి, బట్టలు నిట మునిగి కొట్టుకు పోయినట్లు వాపోయారు. సమాచారం తెలుసుకున్న ఎం.పి.పి. ఇస్మాయిల్ గ్రామానికి చేరుకొని బాదితులతో మాట్లాడి ఆర్దిక సాయం అందించడానికి అధికారులకు సిఫారసు చేస్తామన్నారు.