ఘనంగా 69 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 15 ఆగస్టు, శనివారం అనంతపురం - ఓబులదేవరచెరువు - 69 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం మండల కేంద్రం తో పాటు గ్రామీన ప్రాంతాల్లో ప్రభుత్వ , ప్రైవేటు కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి ఘనంగా వందనాలు తెలిపారు తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీ మోహన్ దాస్ ఏం.పి.డి.ఒ, పోలీస్ స్టేషన్, వ్యవసాయ, పశుసంవర్ధక, ప్రాధమిక వైద్యశాల, గ్రంధాలయం, మండల ఉన్నత పాఠశాల, వెలుగు, ఐ.సి.డి.ఎస్, ఎస్.బి.ఐ బ్యాంకు ఏ.పి.జి.బి బ్యాంకు తదితర ప్రభుత్వ కార్యాలయాల్లో ఏం.పి.డి.ఒ శ్రీరాములు, ఎస్.ఐ మధుసూదన్ రెడ్డి , విధ్యాధికార్లు శ్రీరాములు నాయక్ , రమణ నాయక్ , ఏ.ఒ సత్యనారాయణ, మేనేజర్ భాస్కర్ రెడ్డి, ఎ.పి.ఒ మంజుల, ఏం.ఇ.ఒ కృష్ణ నాయక్, ఏ.పి.ఏం రవీంద్ర అధ్వర్యంలో కార్యాలయాల ఎదుట జెండా ఎగురవేశారు ఘనంగా వందనాలు తెలిపారు. విజ్ఞాన్, మిషణ్ విజ్ఞాన్, జీవనజ్యోతి, టిన్ను విధ్యాసంస్ధలలో ఏం.పి.పి ఇస్మాయిల్, జెడ్.పి.టి.సి పిట్ట ఓబులరెడ్డి, నల్లమాడ సి.ఐ రవీంద్ర నాథ్ రెడ్డి, ముఖ్య అథిదులుగ హాజరై స్వాతంత్ర సమర యోదుల త్యాగాలు ఫలితమే నేడు స్వేఛ్చగా ఉంటున్నామన్నారు. మహానీయులను ఆదర్శంగా తీసుకోని విద్యార్థులు ఆశయాలు కొనసాగించాలన్నారు. అంతకుముందు జీవనజ్యోతి, విజ్ఞాన్ విద్యార్థులు మహాత్మాగాంధీ, నెహ్రు, సుభాష్ చంద్ర బోస్, ఝాన్సీరాణి, దేశభక్తుల వేషధారణతో పుర వీధుల గుండా జైహింద్ జై భారత్ అంటూ నినాదాలు చేస్తూ డప్పు, తాళాలతో ర్యాలి నిర్వహించారు అనంతరం గ్రామీణ, మండల పాఠశాలలో పోటీలలో గెలుపొందిన విద్యార్ధులకు బహుమతులు అందజేసారు ఈ కార్యక్రమాలలో డి.టి మహబూబ్ పీరా, వి.అర్.ఒలు సాంకేతిక సిబ్బంది ఇమ్రాన్, లలితమ్మ, జూనియర్ అసిస్టెంట్ శేక్షావలి, ఏ.ఎస్.ఐ ఇస్మాయిల్ ఖాన్, ఏ.ఇ.ఒలు చందన శిరీష , సి.ఒ సుబ్బారెడ్డి, ఏం.సి రమణ నాయక్ గ్రామీణ పాఠశాలలో ఆయ హెచ్.ఏంలు పంచాయతి సర్పంచ్ లు, ఏం.పి.టి.సిలు తదితరులు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. గ్రామీణ ప్రజలకు సంక్షేమ పధకాలపై అవగాహన కలిపించండి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత CM చంద్రబాబునాయుడు అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టినప్పటికి, ఆపధకాలను ప్రజలకు వివరించడంలో పూర్తిగా వెనుకబడి పోతున్నామని, నిరుపేదలకు పధకాలు అందేలా ప్రజలకు అవగాహన కలిపించాలని ZPTC పిట్టా ఓబులరెడ్డి, మండల కన్వినర్ రామానాయుడు, రాష్ట మైనారిటి, రెతు సంగం నాయకులూ అల్లాబక్షు, రామ్మప్పనాయుడులు పేర్కొన్నారు శెనివారం షాదిమహళ్ లో మండల, గ్రామిన TDP నాయకులు, కార్యకర్తలు, జన్మభూమి కమిటి, సబ్యుల విస్తృతస్థాయి సమావేశం కోఆప్సన్ సబ్యులు టైలర్ నిజాం అద్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ TDP అధికారంలోకి రాగానే రైతు, చేనేత, మహిలారుణాలను మాఫీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. పెన్షన్ 200 నుండి 1500/- వృదులు, వికలాంగులు, వితంతువులకు అందిస్తున్నామన్నారు ప్రభుత్వ పధకాలను అర్హులకు అందేవిదంగా చెర్యలు చేపట్టడంలో నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి అవగాహన కలిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రదాన కార్యదర్శి జయచంద్ర, సర్పంచ్ లు నాగిరెడ్డి, రంగారెడ్డి, బిందుమాదవి, మహిళా అద్యక్షురాలు వైదేహి, తెలుగు యువతానాయకులు మల్లిఖార్జున, సౌది నాగరాజు, SC సెల్ నాయకులు అంజనప్ప, అయ్యప్ప, BC సెల్ రామచంద్ర, సూరి, ఘంట శ్రీనివాసులు, MPTCలు శెంకర్ నాయుడు, గంగన్న, సూర్యనారాయణ, నాయకులూ ఎద్దుల నరసింహారెడ్డి, రాజారెడ్డి, హారూన్, సికిందర్, జెన్నే వెంకటేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో రభస షాదిమహళ్ లో శనివారం TDP నాయకుల, కార్యకర్తల సమావేశంలో మండల సీనియర్ నాయకుల సమక్షంలో పార్టి కార్యకర్తలు వాదనలతో గందరగోళంగా మారింది. పార్టికి జెండాలుమోసి, నిరంతరం శ్రమించి ప్రజాప్రతినిధులను గెలిపించడంలో ఎన్నో కస్టాలు పడినా మమ్మల్ని పటించుకోకపోవడం ఏమిటని అగ్రసేని నాయకులను నిలదియడంతో మిగతా దిగువశ్రేణి నాయకులూ కార్యకర్తులు గళం విప్పారు. బోరు రమణా మాట్లాడుతూ పెద్దనాయకులు అనుకూలించిన వారికి, అనుచర్లకు పనులు కట్టపెడుతునారని, తమలాంటి క్రింధస్థాయి నాయకులను, కార్యకర్తలను నమ్ముకున్న ప్రజల సమస్యల కోసం స్పందించడంలో అగ్ర నాయకులు నిర్లక్షం చేయడం సరికాదని అన్నారు. ఇంతలో పలువురు నాయకులు కలిపించుకొని ఇకమీదట ఇలా జరగకుండా చెర్యలు తెసుకుంటామని సర్ది చేపడంతో శాంతిచారు.