పాఠశాలల్లో విద్యార్థులకు క్రీడలు 14 ఆగస్టు, శుక్రవారం క్రీడాల్లో పోటీల్లో విధ్యార్థినులుఅనంతపురం - ఓబులదేవరచెరువు - మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పంద్రాగస్టు సందర్భముగా గురువారం బాల, బాలికలకు ఉపాధ్యాయులు కబడి, ఖోకో, రన్నింగ్, వ్యాసరచన, చిత్రలేఖనామ్ తదితర పోటీలను నిర్వహించారు. గెలుపొందిన విధ్యార్దులకు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం నాడు బహుమతులు అందజేస్తామన్నారు . ఉపాధ్యాయులకు సూచన ఇస్తున్న బోదకోపాధ్యాయులు ముగిసిన ఉపాధ్య శిక్షణ తరగతులు మండల పరిదిలోని ప్రాధమిక, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు గత 5 రోజుల నుండి బోధనా విధానాలపై శిక్షణ తరగతులు నిర్వహించగా నేడు శుక్రవారం తో ముగిసినట్లు యం.ఇ.ఓ కృష్ణ నాయక్ బోధకులు రమణ, రామకృష లు తెలిపారు.డీలర్ల సమావేశంలో మాట్లాడుతున్న డి.పి సరుకులు సక్రమంగా పంపిణి చేయాలి .. డి.టి మహబూబ్ పీరా మండల పరిధిలోని 42 చౌక ధాన్యపు రేషన్ షాపు సమావేశం శుక్రవారం డి టి మహబూబ్ పీరా అధ్యక్షతన నిర్వహించగా నెల నెల చౌక ధాన్యపు సరుకులు ప్రజలకు సక్రమంగా అందించాలని డీలర్లకు సూచించారు డి.డిలు సకాలంలో కట్టాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని జునియార్ అసిస్టెంట్ షేక్షావలి తెలిపారుతహసిల్దారు కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్న సి.పి.యం నాయకులు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేయాలని సి.పి.యం ప్రభుత్వం రైతులు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేసి ఆదుకోవాలని శుక్రవారం మండల సి.పి.యం, రైతుసంగం అధ్వర్వం లో ధర్నా నిర్వహించారు నాయకులు రమణ శ్రీరాములు వెంకటేష్ నారాయణ శ్రీనివాసులు తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర సి.పి.యం పిలుపు మేరకు రైతు సమస్యల పై నిరసనలు తేలుతున్నట్లు పేర్కొంటూ డిప్యుటి తహసిల్దార్ శ్రీ మహబూబ్ పీరా కు వినతి పత్రం అందజేసారు.