చింత చెట్టు ఆటో పైన పడి వ్యక్తి మృతి 5 ఆగస్టు, బుధవారం చెట్టుకింద పది ద్వంసమైన ఆటో అనంతపురం - ఓబులదేవరచెరువు - మండల పరిధిలోని మిట్టపల్లి గ్రామం వద్ద మంగళవారం ప్రయాణిస్తున్న ఆటోపైన చింతచెట్టు పడి తనకల్లు మండలం బత్తినపల్లికి చెందినా రాజన్న(48) మృతి చెందారు. కదిరి నుండి మండల పరిధిలోని గారుకుంట్లపల్లి వస్తున్న ఆటో మిట్టపల్లి వద్ద రాగానే ఉన్న ఫలంగా పెద్ద చింత చెట్టు పడడంతో రాజన్న అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆటోలో ప్రయాణిస్తున్న అయిదుగురు ప్రయాణికులతో పాటు డ్రైవర్ కు గాయాలు కావడంతో 108 ద్వారా కదిరి ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. SI మధుసూదన్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.మరణించిన ఆటోడ్రైవర్ రాజన్న