కేప్ టౌన్ లో భరత్ మొదటి విజయం అతి తక్కువ బంతులు ఆడిన టెస్ట్ మ్యాచ్ గా రికార్డు 4 జనవరి, గురువారం అంతర్జాతీయం - కేప్ టౌన్ లో జరుగుతున్న రెండవ టెస్టులో 2వ రోజు ఆఖరి రోజుగా మారుతుందన్న అంచనాలతో మొదలుయ్యింది, సరిగ్గా అదే జరిగింది. జస్ప్రీత్ బుమ్రా తొలి ఓవర్లోనే వికెట్ పడగొట్టడంతో సౌత్ ఆఫ్రికా పతనం ప్రారంభమైంది. కొన్ని అద్భుతమైన క్యాచ్ లు, కొన్ని పేలవమైన షాట్ కారణంగా ప్రోటీస్ 7 వికెట్లకు 111 పరుగుల వద్ద కుప్పకూలే స్థితికి వచ్చింది. అయితే, KL రాహుల్ 73 పరుగుల వద్ద ఐడెన్ మార్క్రామ్ క్యాచ్ ని వదిలేయడంతో, ఇదే అదునుగా మార్క్రామ్ చెలరేగిపోయి అర్ద సెంచరీ చేయడం గగనమైన పిచ్ పైన దూకుడుగా ఆడి సెంచరీ పూర్తి చేసాడు. అతను ఈ సెంచరీని తన కెప్టెన్, అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన డీన్ ఎల్గర్కు అంకితమిచ్చాడు. అతను 106 పరుగుల వద్ద అవుట్ అవడంతో వారు 79 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేసిన్చగలిగారు. ఆ తరువాత బరిలోకి దిగిన జైస్వాల్ దూకుడుగా ఆడి భారత్ కు శుభారంభాన్ని అందించారు, చేదనలో జైస్వాల్, గిల్,విరాట్ వికెట్లను కోల్పోయినా కెప్టెన్ రోహిత్ నాటౌట్ తో సహా అయ్యర్ బౌండరీతో ఈ మైదానంలో భరత్ మొదటి భారీ గెలుపుని అందుకుంది. ఒకే స్కోర్ వద్ద ఎక్కువ వికెట్స్ కోల్పోయిన ఘనత అంతకు ముందు మొదటిరోజు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న, డీన్ ఎల్గార్ నిర్ణయం బెడిసికొట్టింది, బుమ్రా సారథ్యంలోని భారత పేసర్లు దక్షిణాఫ్రికాను కేవలం 55 పరుగులకే కట్టడి చేశారు, ఇది టెస్టుల్లో భారత్పై ఏ జట్టుకు అయినా అత్యల్ప స్కోరు. కైల్ వెర్రెయిన్ మరియు డేవిడ్ బెడింగ్హామ్ మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. మొదటి రోజు లంచ్ తర్వాత, రోహిత్ శర్మ మరియు శుభ్మాన్ గిల్ పార్టనర్ షిప్ వలన భారత్ పటిష్టంగాఉన్నట్లు అనిపించింది.రోహిత్ తరువాత వచ్చిన కోహ్లి గిల్, రాహుల్ తో కలిసి మంచి స్కోర్ దిశగా వెళుతున్న సమయం లో దిగ్భ్రాంతికరమైన పతనంతో 153 పరుగుల వద్ద ఆరు వికెట్లు కోల్పోయి, ఒకే స్కోర్ వద్ద ఎక్కువ వికెట్స్ కోల్పోయిన అవాంఛిత రికార్డును నెలకొల్పారు.