ప్రత్యేక హోదా సాదించే వరకు ఉద్యమిస్తాం .. అకిల పక్షాలు 11 ఆగస్టు, మంగళవారం అనంతపురం - ఓబులదేవరచెరువు - రాష్టానికి ప్రత్యేకమైన హోదాను అమలుపర్చెంతవరకు ఉద్యమాలు కొనసాగిస్తామని అఖిలపక్షపార్టీలనాయకులు వేమయ్య యాదవ్, ఓబులకొండ, నరసింహులు , మనోహర్ నాయుడు, డిమాండు చేసారు మంగళవారం అఖిలపక్షపార్టీల నాయకుల పిలుపు మేరకు మండల సిపిఐ సిపిఎం , కాంగ్రెస్ , వై యస్ అర్ , జనసేన పార్టి నాయకుల అద్వర్యంలో మండల కేంద్రంలో బందు నిర్వహించారు ముందుగా వ్యాపార వాణిజ్య దుకాణాలు , ప్రెవేటు ప్రభుత్వ విద్యాసంస్థలు, కార్యాలయాలు ర్యాలీగా నినాదాలు చేసుకుంటూ కార్యాలయాలను బందు చేపట్టారు. అనంతరం నాయకులు మున్నా, రమణ, శ్రీనివాసులు, శ్రీరాములు, కోళ్ల కృష్ణ రెడ్డి , రావింద్రనాయుడు, బాబా తదితరులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్రాలలో బిజెపి, టీడిపి ప్రభుత్వ పాలనలో సీమాంద్రకి ప్రత్యేక హోదా కలిపించడంలో నిర్లక్షం చేస్తూ ప్రజలని వీదిపాలు చేసేందుకు కుట్రపన్నుతునారని విమర్శించారు ప్రత్యేక హోదా కేటాయిస్తే రాయలసీమ, సీమాంద్ర లో పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉపాది పొందేందుకు అవకాశం ఉందన్నారు. ప్రత్యేక హోదాతో అన్ని రంగాలలో అబివృద్ది సాదించ గలమని తెలిపారు. ప్రదాని నరేంద్ర మోడీ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్లిబొల్లి మాటలు చెబుతూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు మోడీ పైన ప్రత్యేక హోదా తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వత్తిడితీసుకురావడంలో జంకడంలో అంతర్యం ఏంటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఇప్పటికైనా సిమాంద్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ లో ప్రత్యేక హోదా బిల్లు ను ప్రవేశ పెట్టాలని వారు డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో వామపక్షాలు అకిలపక్ష నాయకులు, కార్యకర్తలు బారిం, హైదర్ వల్లి వెల్డింగ్ బాషా, రామచంద్ర, శేషు, అమరనాథ్ నాయుడు, పెద్ద రంగప్ప, వేణు, చంద్రమౌలి నాయుడు రామంజనేయులు, మహబూబ్ బాషా,తదితరులు పాల్గొన్నారు. కదిరి లో .. కదిరి పట్టణంలో ప్రత్యేక హోదా సాధనకోసం ప్రత్యేక హోదా సంరక్షణ కమిటి నాయకుల ఆద్వర్యంలో మంగళవారం బంద్ నిర్వహించగా సి పి యం, సి పి ఐ, కాంగ్రెస్ పార్టీల నాయకుల మద్దతుతో బంధు విజయవంతం చేసారు కాగా ఏం ఎల్ ఏ. చాంద్ బాషా తో పాటు పార్టి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు నల్లచెరువు, నల్లమాడ , పుట్టపర్తి మునిసిపాలిటి లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కోట సత్యం అద్వర్యంలో బారి ఎత్తున ర్యాలి నిర్వహించి ధర్నా చేపట్టగా నాయకులూ సామకోటి ఆదినారాయణ , చంద్రశేకర్ గుప్తా, బుట్టి నాగభూషణం నాయుడు , అంజి పాల్గొనారు. తదితర మండలాలలో ప్రతేక హోదాతో నిరసనలు తెలిపారు.