అంగరంగ వైభవంగా కనులవిందుగా రాంలల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠాపన 22 జనవరి, సోమవారం జాతీయం - వార్త - ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా అయోధ్యలో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మరియు ఇతర ప్రముఖుల సమక్షంలో జరిగింది. శంకుస్థాపన సందర్భంగా ఆలయ ఆవరణలో ఆర్మీ హెలికాప్టర్లు పూలవర్షం కురిపించాయి.మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ నైపుణ్యంతో రూపొందించబడిన 51 అంగుళాల పొడవుతో ఎంతో మనోహరంగా ఐదేళ్ల రాముడు తామరపుష్పంపై నిలబడి ఉన్న ఈ విగ్రహం, కేవలం ఒకే రాతి నుండి అన్ని సూక్ష్మ వివరములతో చెక్కబడింది. ఈ గ్రాండ్ ఈవెంట్కు దేశవ్యాప్తంగా నటులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు మొదలైన వారితో సహా సుమారు 7,000 మంది VVIP లు హాజరయ్యారు.సాంప్రదాయ నాగర నిర్మాణ శైలిలో నిర్మించబడిన, రామమందిరం తూర్పు-పశ్చిమ దిశలో 380 అడుగుల విస్తీర్ణంలో 250 అడుగుల వెడల్పు మరియు 161 అడుగుల ఆకట్టుకునే ఎత్తుతో రూపొందించబడింది. ఆలయం నిలువు నిర్మాణశైలిలో అంతస్తులను కలిగి ఉంటుంది, ఒక్కొక్కటి 20 అడుగుల ఎత్తు ఉంటుంది, అద్భుతమైన కళతో మలచబడిన 392 స్థంబాలతో మరియు 44 ద్వారాలతో అలంకరించబడింది.PM మోడీ 11 రోజుల కఠినమైన "అనుష్ఠాన్"ను అనుసరించి, నేలపై పడుకున్నారు మరియు జనవరి 22 న అయోధ్యలో జరిగే వేడుకకు ముందు కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమె తాగారు. రామమందిరం యొక్క "ప్రాణప్రతిష్ఠ" వేడుకకు ముందు భారతదేశంలోని అనేక దేవాలయాలను సందర్శించారు. రామేశ్వరం "అంగి తీర్థం" బీచ్లో పవిత్ర స్నానం చేశారు. అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పూజలు నిర్వహించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ వందేళ్ల నిరీక్షణ సోమవారంతో ముగియడంతో ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పిఎం మోడీ "రాబోయే 1,000 సంవత్సరాలు భారతదేశానికి పునాది వేయండి అని ప్రజలను ప్రోత్సహింస్తూ పిలుపునిచ్చారు. ఈ క్షణం నుండి సమర్థమైన, గొప్ప, దివ్యమైన భారతదేశాన్ని నిర్మిస్తామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. రామ మందిరం, రాముడి శక్తి, వివాదాన్ని కాదు పరిష్కారాన్ని తెస్తుంది కాబట్టి అందరు పునరాలోచించాలి అని సోమవారం అయోధ్యలో ప్రధాని మోదీ అన్నారు.