అంబేద్కర్ భవనానికి స్థలం కేటాయించాలి 5 ఆగస్టు, బుధవారం అనంతపురం - ఓబులదేవరచెరువు - మండల కేంద్రంలో డా|| అంబేద్కర్ భవనానికి ప్రభుత్వం స్థలం కేటాయించాలని గురువారం తహశిల్దార్ మోహన్ దాస్ కు మండల మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు రమణ, అయ్యప్ప, పలకగంగన్న, ఆనంద్ తదితరులు వినతిపత్రం అందించారు. మండల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనారిటీల సమస్యలపై ఎం.ఆర్.పి.ఎస్ నిరంతరం పాలకులు అధికారులు దృష్టికి తీసుకొస్తున్నట్లు తెలిపారు. అంబేద్కర్ భవనం నిర్మిచి అన్నివర్గాల వారికి స్పూర్తిదాయకంగా ఉంటుందన్నారు.