విజయవంతంగా 20 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపిన ఇస్రో 22 జూన్, బుధవారం 20 ఉపగ్రహాలని అంతరిక్షంలో ప్రవేశపెట్టిన పి.ఎస్.ఎల్.వి-స్34జాతీయం - వార్త - భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ( ఇస్రో ) స్పేస్ టెక్నాలజీ చరిత్రలో బుధవారం ఒక కొత్త రికార్డు సృష్టించంది. ముప్పై ఆరవదైన ఇస్రో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పి.ఎస్.ఎల్.వి-స్34), 727.5 కిలోల కార్టోసాట్-2 సిరీస్ శాటిలైట్ తో సహా 19 ఇతర ఉపగ్రహాలను ఉదయం (జూన్ 22, 2016) 9:26గం.లకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుండి విజయవంతంగా ప్రారంభించింది. ఎక్సెల్ కాన్ఫిగరోషన్ లో 14వది అయినటువంటి విశిష్టత కలిగిన ఈ పిఎస్ఎల్వి వరుసగా ముప్పై ఐదవసారి విజయవంతగా ప్రారంభించింది. 20 ఉపగ్రహాల మొత్తం 1288 కిలోల ఆన్ బోర్డు బరువు కలిగిన పి.ఎస్.ఎల్.వి-స్34 నంగికి ఎగసిన 17 నిముషాలలో ఉపగ్రహాలనన్నింటిని కక్ష్యలో ఉంచడం ప్రారంభించింది. 19 ఉపగ్రహాలలో రెండు – సత్యభామసాట్ (1.5 కిలోలు), స్వయెం(1 కిలో) సత్యబామ విశ్వవిద్యాలయం, చెన్నై మరియు ఇంజనీరింగ్ కాలేజ్, పూనే విద్యార్థులచే నిర్మించబడినవి. మిగిలిన 17 ఉపగ్రహాలు అంతర్జాతీయ వినియోగదారులైన కెనడా(2), జర్మనీ(1), ఇండోనేషియా(1) మరియు యునైటెడ్ స్టేట్స్(13) చెందినవని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారుచివరి దశలో ఇస్రో పి.ఎస్.ఎల్.వి-స్34 సామర్ధ్యన్ని ప్రదర్శిస్తూ వివిధ కక్ష్యలో ఉపగ్రహాలని అమర్చగలిగారు. ఈ ప్రదర్శన ద్వారా ఒకే శాటిలైట్ తో వివిధ ఉపగ్రహాలను కక్ష్యలో ఉంచడం వారి తదుపరి లక్ష్యం అని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఒకేసారి 20 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో రికార్డు నెలకొల్పింది. ఇంతకుముందు 2008 ఏప్రిల్ 28న పిఎస్ఎల్వి అత్యధకంగా 10 ఉపగ్రహాలు కక్ష్యలో చేర్చగలిగింది. 2013లో నాసా 29 ఉపగ్రహాలను 2014లో రష్యా 33 ఉపగ్రహాలను విజయవంతంగా ఉపగ్రహాల కక్ష్యలో చేర్చగలిగారు.ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రత్యక్షంగా అభినందనలు తెలుపుతున్న ప్రధానమంత్రి నరేంద్రమోది ప్రధానమంత్రి నరేంద్రమోది అభినందనలు బుధవారం 20 ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్రమోది, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి తో సహా పలువురు రాజకీయనాయకులు అభినందించారు.