8 ఏళ్ల అమ్మాయి లేఖకు స్పందించిన ప్రధానమంత్రి వెంటనే చికిత్స చేయాలని ఆదేశించిన ప్రధానమంత్రి మోడీ 8 జూన్, బుధవారం జాతీయం - ఇంటర్నెట్ - గుండె జబ్బుతో బాదపడుతున్న చిన్నారికి సర్జరీ చేయాలని ఆదేసించి ఆడుకున్న ప్రధానమంత్రి మోడీ. అంతకుముందు తైయబ (వయస్సు 8 ఏళ్ళు , ఆగ్రా) అనే ముస్లిం అమ్మాయి గుండె జబ్బుతో బాదపడుతూ వుండేది. ఆర్ధికంగా వెనకపడిన ఆ కుటుంబం ఖర్చు ఎక్కువ అవుతుండటంతో సర్జరీ చేయించలేని పరిస్థితులలో, తన చికిత్స కోసం ఆర్ధిక సహాయం కోరుతూ ప్రధానమంత్రికి లేఖ రాసింది ఆ చిన్నారి.తనది మొహమ్మద్ ఖాలిద్ ఒక ఫ్యాక్టరీ లో ఉద్యోగి. నెలసరి జీతం ఇంటికే సరిపోయేది కాదు. పాపకి సర్జరీ చేయించలేని పరిస్థితి. జబ్బు తీవ్రమవుతుండడంతో ఆసుపత్రికి గత (మే) నెల తీసుకువెళ్ళారు. ఖర్చు ఎక్కువ అవుతుందని తెలిసి డాక్టర్ ఇచ్చిన సలహా మేరకు తన కూతురితో ఆర్ధిక సహాయం కోరుతూ చికిత్స వివరాలతో ప్రధానమంత్రి ( PMO ) ఆఫీసుకు లేఖ రాయించాడు.లేఖ అందుకున్న ప్రధానమంత్రి ఆఫీసు, అమ్మాయి చికిత్స కోసం GB పంట్ ఆసుపత్రి, న్యూ ఢిల్లీ లో అన్ని ఏర్పాట్లు చేయించారు. అమ్మాయి సర్జరీ ఖర్చులు అన్ని ప్రభుత్వమే భరిస్తుందని అమ్మాయి కుటుంబానికి సమాచారం తెలిపారు.