నాందేడ్ ఎక్స్ ప్రెస్ ను ఢీకెన్న గ్రానైట్ లారీ - ఐదుగురి మృతి 24 ఆగస్టు, సోమవారం ప్రమాదంలో పూర్తిగా దెబ్బ తిన్న బోగీఅనంతపురం - పెనుకొండ - అనంతపురం జిల్లా పెనుకొండ మండలం మడకశిర లెవల్ క్రాసింగ్ వద్ద సోమవారం తెల్లవారుజామున బెంగళూరు నుండి నాందేడ్ వెళ్తున్న నాందేడ్ ఎక్స్ ప్రెస్ హెచ్1 బోగీని అదుపు తప్పిన గ్రానైట్ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీలోని భారీ గ్రానైట్ రాయి హెచ్1 బోగీపై ఎగిరిపడటంతో బోగీ పూర్తిగా దెబ్బతినడం మరో 2 బోగీలు పక్కకు ఒరగడం జరిగింది. ప్రమాదంలో ఆదుగురు మరణించారు. మృతుల్లో రాయిచురు దేనదుర్గ్ ఎం.ఎల్.ఏ వెంకటేష్ నాయక్, ఐ.ఐ.జి జి.యం రాజు, రాయిచురుకు చెందిన పుల్లారావు, రైల్వే ఎంప్లాయి సయ్యద్ అహ్మద్, లారీ క్లీనర్ ఉన్నారు.అదుపు తప్పినా బోగీలు