హైదరాబాద్ రోడ్లపై ఒకే రోజు పట్టుబడ్డ 269 మైనర్ డ్రైవర్లను 16 జూలై, శనివారం పట్టుబడ్డ వారిని కౌన్సిలింగ్ చేస్తున్న పోలీసులుహైదరాబాద్ - వార్త - నగరంలో సురక్షితమైన రోడ్డు ప్రయాణం కొరకు హైదరాబాద్ పోలీసులు చేపట్టిన కార్యక్రమంలో గురువారం ఒకేరోజు 200 పైగా మైనర్ డ్రైవర్లు పట్టుబడ్డారు. నగరంలోని నార్త్ జోన్ ప్రాంతంలో, 269 మైనర్ డ్రైవర్లు పట్టుబడ్డారు. పట్టుబడిన వారికి, వారి తల్లిదండ్రులతో పాటు కలిపి తప్పనిసరిగా మూడు రోజులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. జూలై 2వ తేది ఒక స్థానిక బార్ నుండి స్నేహితులతో కలసి కారులో ఇంటికి వెళుతున్న 20 ఏళ్ల శ్రావిల్, 10-ఏళ్ల రమ్యను ఆక్సిడెంట్లో ఢీకొట్టడంతో మరణించింది. రమ్య మరణానంతరం నగర పోలీసులు చొరవతీసుకుని సురక్షితమైన రోడ్డు ప్రయాణం కొరకు ప్రత్యేకమైన కార్యక్రమం చేపట్టారు. 2 నిముషాలు చనిపోయిన రమ్యకు నిశ్శబ్ద నివాళితో మోదలై, నిర్లక్ష్యంతో త్రాగి డ్రైవింగ్ చేయడం వలన జరిగే పరిణామాలను తల్లిదండ్రులకు వివరించడం ఈ కౌన్సిలింగ్ లో భాగము. పిల్లల డ్రైవింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవలసిన భాద్యత తల్లిదండ్రులదే అని, అలాగే వారి పిల్లలు అర్థం చేసుకుంటారని, ట్రాఫిక్ రెగ్యులెషన్ ఆఫీసర్ జితేందర్ చెప్పారు.