హైదరాబాద్ లో ఇద్దరు ఐఎస్ అనుమానితులు అరెస్టు 13 జూలై, బుధవారం ఐఎస్ టెర్రర్ అనుమానితులను మంగళవారం హైదరాబాద్ లో నాంపల్లి కోర్టుకు తీసుకెళుతున్న ఎన్ఐఎజాతీయం - వార్త - ఐదుగురుతో కూడిన ఇస్లామిక్ స్టేట్(IS) మాడ్యూల్ ని ఇటీవల కాలంలో చేధించిన లా ఎన్ఫోర్స ఏజెన్సీలు, తము అనుకూన్న దాని కంటే చాలా ప్రమాదకరంగా ఉండవచ్చని తెలిపాయి. అరస్ట్ అయిన ఐదుదగురి ఐఎస్ అనుమానితులకి సహాయ సహకారాలు అందింస్తున్నారని, మంగళవారం నగరంలో ఇద్దరు యువకులు అతుల్లా రెహ్మాన్ మరియు యాసర్ నఇమతుల్లా లను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ) అరెస్ట్ చేసారు. వాల్లని నాంపల్లిలోని ఎన్ఐఎ కేసులు ప్రత్యేక కోర్టు ముందు హాజరు పరిచి, జ్యుడిషియల్ కస్టడీలో ఉంచారు. నివేదిక ప్రకారం వాళ్ళద్దరు దేశానికి వ్యతిరేకంగా తీవ్రవాద దాడులు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ఐఎ సమాచారం ప్రకారం, ఐఎస్ మాడ్యూల్ సభ్యులని కూడగట్టి ఒకచోట చేర్చడంలో రెహ్మాన్ కీలకం అని, బహిరంగ స్థలాలలో ఇంప్రూవైజ్డ్ ఎక్స్పోసివ్ డివైస్ (ఐఇడి)లు పేల్చడం వీరి కుట్రలో భాగమన్నారు.