వర్షాలవల్ల తగ్గుముఖం పట్టిన కూరగాయలు మరింతగా తగ్గే అవకాశం 12 జూలై, మంగళవారం తగ్గుముఖం పట్టిన కూరగాయలుహైదరాబాద్ - వార్త - స్థానిక పంటలలో ముఖ్యమైన కూరగాయలు గత ఏడు రోజుల ధరలతో పోలిస్తే 50 శాతం వరకు తగ్గాయి. ప్రస్తుతం పడుతున్న వర్షాల వల్ల రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్ , నల్లగొండ వంటి పొరుగు జిల్లాల్లో పంట ఉత్పత్తి పెరిగింది. నగరంలోని రైతు బజారుతో సహా మార్కట్లు అన్నింటికి ఎక్కువగా ఈ జిల్లాల నుండే దిగుబడి అవుతుండడంతో ధరలు తగ్గుముఖం పట్టయి. మెహదీపట్నం రైతు బజార్ ఎస్టేట్ అధికారి కె విజయ్ కుమార్ మాట్లడుతూ టమోటా, పచ్చిమిర్చి, వంకాయలు, బండకాయ, పొట్లకాయ తదితర స్థానిక పంటలు చేవెళ్ల, వికారాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాలో ఇతర ప్రాంతాల నుండి ఎక్కువగా సరఫరా అవుతాన్నయి అని చెప్పారు. "అదేవిధంగా, శంకర్ పల్లి, నవాబ్ పేట్, మోమిన్ పేట్, వికారాబాద్, రంగారెడ్డి మరియు మెదక్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల నుండి కూకట్పల్లి మరియు ఎర్రగడ్డ రైతు బజార్లకు కూరగాయలు సరఫరా అవుతున్నాయి. ఉత్పత్తి పెరిగడంతో వచ్చే వారం ఇంకా ధరలు తగ్గే అవకాశం ఉందని, పక్క రాష్ర్టాలలో కూడా వర్షాలు ఎక్కువగా పడుతుండడంతో అక్కడి నుంచి వచ్చే ఉల్లపాయ, చిక్కుడుకాయ, కాప్సికం వంటి కూరగాయల ధరలు తగ్గే అవకాశం ఉందని" ఆయన చెప్పారు.