కాశ్మీరులో ఉద్రిక్తత... విధించిన ఆంక్షలు... తాత్కాలికంగ అమర్నాథ్ యాత్ర రద్దు 9 జూలై, శనివారం నిర్జీవంగా ఉన్న నగరంలో పోలీసుల గస్తీజాతీయం - భక్తి-ఆరోగ్యం - కాశ్మీరులో భద్రతా దళాలు హిజ్బుల్ ముజాహిదీన్ హత్య చేసిన తరువాత జరుగుతున్న ఉద్రిక్తత సంఘటనలవల్ల శ్రీనగర్, కాశ్మీరు లోయలలో కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించారు. నిరసనలు చేస్తున్నవారిని ఆదీనంలోకి తీసుకున్న అక్కడి అధికారులు తాత్కాలికంగ అమర్నాథ్ యాత్రను కూడా రద్దు చేశారు.నిరసనకారులు నగరంలోకి ప్రవేశించే ప్రధాన రహదారులను పలుచోట్ల అడ్డగంచి, ధర్నాకు పిలుపునిచ్చిన ముఖ్యమైన వేర్పాటువాద నాయకులను ముందు జాగ్రత్తగా సంరక్షణలో ఉంచారు. అయితే కాశ్మీర్ అంతటా మొబైల్ ఇంటర్నెట్ సస్పెండ్ చేశారు, మొబైల్ టెలిఫోన్ సేవలు కూడా దక్షిణ కాశ్మీర్లోని పరిమితం చేశారు.యాత్ర రద్దు చేయడంతో యాత్రికుల ఇక్కట్లుఇప్పటివరకు కాశ్మీరులో చాలా ప్రాంతాలలో ప్రశాంతంగా ఉంది, కానీ ఉగ్రవాద నాయకుడి స్వస్ధలం అయిన ట్రాల్, కొకెర్నాగ్ ప్రాంతంలో నిరసనలు తవ్రంగా ఉన్నట్లు ఒక పోలీస్ అధికారి తెలిపారు. శ్రీనగర్ నగరంలోని ఆరు పోలీసు స్టేషన్ ప్రాంతాల్లో, దక్షిణ కాశ్మీర్లో, అనంతనాగ్ పట్టణంలో, పుల్వామా జిల్లాలోని చాలా ప్రాంతాల్లో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ముందు జాగ్రత్త చర్యగా పరిమితులతో కూడిన ఆంక్షలను విధించినట్టు అక్కడి సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. వాని మరణ వార్తా తర్వాత జరుగుతున్న నిరసనలవల్ల ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని ఆయన తెలిపారు. కొంత మంది యువకులు భద్రతా దళాలాల శిబిరాలపై రాళ్ళు చెత్తని విసిరి రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ఎదురుదాడి చేయలేదని ఆయన చెప్పారు. అధికారులు ముందు జాగ్రత్త చర్యగా జమ్మూ బేస్ క్యాంపు నుంచి లోయలో బల్టాల్ మరియు పహల్గామ్ బేస్ క్యాంపుల వరకు అమర్నాథ్ యాత్రను రద్దు చేశారు. ఆందోళనకారులు రైళ్లని లక్ష్యం చోసుకునే అవకాశం ఉన్నందున కాశ్మీరులోని బరముల్ల బనిహల్ లో పీర్ పంజల్ పర్వత శ్రేణి మధ్య రైలు సేవలు ఒక రోజు నిలిపివేశారు.