ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం 2016 21 జూన్, మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్బంగా యోగాసనంలో ప్రధాని - వార్త - యోగా మానవజాతికి ఒక వరం లాంటిది, యోగా చేయడం వల్ల శరీరం, మనస్సు ఎంతో తేజోమయం అవుతుంది. యోగా కేవలం ఒక వ్యాయామం మాత్రమేకాదు, యోగా వల్ల అంతర్ బాహ్య ప్రత్యేక భావములను తెలుసుకుంటూ మానసిక శారీరక శక్తిని పొందగలరు. జూన్ 21 2015 అంతర్జాతీయ మొదటి యోగా దినోత్సవం జరుపుకోగా, ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవంలో 135కుపైగా దేశలు పాలుపంచుకున్నాయి. జూన్ 21 మంగళవారం రెండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సంధర్బంగా దేశ, విదేశాలలో విస్తృత ఏర్పాట్లు జరిగాయి. ప్రధానమంత్రితో సహా కేంద్ర రాష్ట్రమంత్రులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంన్నారు మంగళవారం రెండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సంధర్బంగా చండీగఢ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 30,000 మందితో కలసి స్వయంగా యోగాసనాలు వేశారు. దేశవ్యాప్తంగా పలు ముఖ్యపట్టణాలలో యోగా దినోత్సవంలో వేలమంది పాల్గోని యోగాసనాలు వేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభుతో పలువురు యోగాసనాలువిజయవాడలో ఏ1 కన్వెన్షన్ సంటర్ లో నిర్వహంచిన అంతర్జాతీయ యోగా దినోత్సనాన్ని ఘనంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహ కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు, రాష్ట్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొని ఆసనాలు వేశారు.పుదుచ్చేరిలో ఆసనాలు వేస్తున్న లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీలెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ నేడు అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా పుదుచ్చేరిలో సుమారు 6,000 పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు, అధికారులు మరియు ఎన్సిసి స్వచ్ఛంద సేవలతో కలసి బీచ్ రోడ్ లో ఉ-6.30 గంటల నుంచి దాదాపు 90 నిముషాలపాటు 40 వివిధ ఆసనాలు ప్రదర్శించారు.