గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం... 10 రోజుల పసికందుపై 2రోజుల క్రితం ఎలుకల దాడి....బుదవారం ఉదయం బాలుడి మృతి పశ్చిమ గోదావరి జిల్లాలో మహిళలపై అపరిచత వ్యక్తి మత్తుమందు సూదులతో దాడి... జిల్లాలో కలకలం 26 ఆగస్టు, బుధవారంగుంటూరు - పుట్టిన వారం రోజులకే అనారోగ్యంతో గుంటూరు ఆసుపత్రిలో చికిత్సకోసం చేరితె ఎలుకల దాడిలో పదిరోజుల పసికందు మృతి చెందిన సంఘటన సంచలనం రేపింది. గుంటూరు జిల్లాలో లక్ష్మి, నాగ దంపతులకు పదిరోజుల క్రితం జన్మంచిన బాలున్ని గుంటూరు ప్రభుత్వ హాస్పటలులో చేర్చారు. బాలుడికి అవయవ లోపాలతో బ్రతకడం కష్టమైన చికిత్స నిమిత్తం ప్రత్యేక వర్డులో వైద్యులు చికిత్సలు చేస్తుండడంతో ఆదివారం రాత్రి ఎలుకలు బాలుడిపై దాడి చేసి గాయపరిచాయి. వైద్యులు బాలుడి శరీరంపై గాయాలను చీమల గాట్లుగా భావించి వైద్యసేవలు అందించగా, బాలుడి తల్లిని సోమవారం రాత్రి స్టాఫ్ నర్సు సిబ్బంది బాలుడి వార్డు వద్దకి వెల్లకుండ నివారించినా, కాపలాగ వుండి చూడడంతో పదులసంఖ్యలో ఎలుకలు బాలుడిపై దాడి చేయడం చూసి భయభ్రాంతులకు గురై సిబ్బందికి తెలిపినా నిర్లక్ష్యంతో బాలుడి మృతికి కారకులయ్యారని సర్వత్ర విమర్శలు వెళ్ళవెత్తుతున్నాయి. బధవారం బాలుడు మృతి చెందడంతో ప్రభుత్వము గుంటూరు ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సర్వత్ర డిమాండ్ చేస్తున్నారు.