రైతు భూసమస్యల పరిష్కారానికి మీ ఇంటికి మీ భూమి.... శోత్రియందారులకు చట్ట బద్దంగా న్యాయం చేస్తాం .. మంత్రి పల్లె 17 ఆగస్టు, సోమవారం సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పల్లెఅనంతపురం - ఓబులదేవరచెరువు - రైతు భూసమస్యల పరిష్కారం కోసం తెలుగు దేశం మీ ఇంటికి మీ భూమి కార్యక్రమం చేపట్టిందని రాష్ట్ర ఐటి, సమాచార, మైనారిటీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు . సోమవారం మండల పరిధిలోని తంగెేడుకుంట గ్రామా పంచాయతి కార్యాలయం లో మండల తహసిల్దార్ మోహన్ దాస్ ఆధ్వర్యం లో నిర్వహించిన మీ ఇంటికి మీ భూమి కార్యక్రమానికి మంతి పల్లె ముఖ్య అతిధిగా హాజరు కాగా సర్పంచ్ శాంతమ్మ అధ్యక్షత వహించారు మంత్రి పల్లె మాట్లాడుతూ భూ సమస్యల కోసం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రంలో రైతులు భూ విస్తీర్ణం, టెన్ ఒన్ , వారసుల పేర్లు సవరణ క్రయ విక్రయ రికార్డుల తదితర ఆధారాలతో కూడిన వివరాల పత్రాలు రెవిన్యూ అధికారుల దృష్టికి తిసుకేల్లాలని కోరారు. రాష్ట్రము ఆర్ధిక పరిస్తితులలో ఉన్న సి.యం చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వృధులు, వికలాంగులు, వితంతువులో 1000-1500 వరకు పింక్షన్లు అందచేయడం, రైతు రుణమాఫీ తో రైతు లబ్ది పొందడం, విద్యార్థుల సంక్షేమానికి పాఠశాలల అభివ్రుది కార్యక్రమాలను ప్రవేశ పెట్టారు. తంగెేడుకుంట గ్రామానికి చెందిన శోత్రియం రైతుల సమస్యలపై 10 సంవత్సరాల క్రితం అసెంబ్లీ లో చర్చించి జిల్లా అధికారుల సమక్షం లో శోత్రియం దారులకి హక్కులు కల్పించిన ఘనత తమదేనన్నారు. ప్రస్తుతం శోత్రియుం దారులకు భూమి పట్టా పాసుబుక్కులు పొందక పోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలకి దూరంగా ఉన్నారని వీటిపైన చట్ట బద్దంగా న్యాయం చేసి భూ హక్కు దారులుగా గుర్తింపు దారులుగా తీసుకొచ్చే భాద్యత తెదేప ప్రభుత్వం దే అని భరోసా ఇచ్చారు. సమావేశం అనంతరం పంక్షన్లు, రేషణ్ కార్డులు, మరుగు దొడ్లు, గృహ నిర్మాణాలకోసం వినతాపత్రాలు ప్రజల నుండి వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమంలో తాసిల్దారు మొహంన్ దాస్, యం.పి.డి.ఒ శ్రీరాములు, వి.అర్.వో ఇనయతుల్ల తదితరులు పాల్గొన్నారు. టి.డి.పి కార్యాలయమును ప్రారంభించిన మంత్రి పల్లె మండల కేంద్రం లో మీసేవ కార్యాలయం వద్ద సోమవారం రాష్ట్ర మంత్రివర్యులు పల్లె రఘునాథ రెడ్డి టి.డి.పి కార్యాలయంను ప్రారంభించారు. మండల కన్వీనర్ రామానాయుడు జెడ్ పి సభ్యులు పిట్ట ఓబులరెడ్డి రాష్ట్ర నాయుకులు రామప్పనాయుడు ,అల్లబకాష్ , మండల ప్రధాన కార్యదర్శి జయచంద్ర , టైలర్ నిజాం (కో మెంబెర్ ) నాయకులు అది నారాయణ నాయక్ , నరసింహారెడ్డి, సూరి , బోర్ రమణ , పీట్ల సుధాకర్ , అంజనప్ప, వేంకటేష్ నాయుడు, రాజారెడ్డి, సౌది నాగరాజు, ఘంటా శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.గ్రామస్తుల నుండి వినతులు స్వీకరిస్తున్న మంత్రి పల్లె, తహసిల్దారు