ఘనంగా శ్రావణమాస వేడుకలు 17 ఆగస్టు, సోమవారం అనంతపురం - ఘనంగా అమ్మవారికి బోణాలు: మండలంలోని జంబులవాండ్లపల్లి గ్రామదేవత పోలేరమ్మవారికి ఆదివారం గ్రామస్థులు వర్షం కురవాలని భోనాలు సమర్పించారు వర్షాలు కురవక పోవడంతో మూగజీవాలు పశు గ్రాసంలేక అలమటి౦చడం, వేసిన పంటలు ఎండుముకం పట్టడంతో గ్రామదేవకు 101 బిందెలతో జలాభిషేకం చేసి, ప్రతియింటి నుంచి మహిళలు వేపాకులతో భోనాలు మోసుకోనివచ్చి అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించి సమర్పించారు. ముందుగా ఆలయంలో వున్న అమ్మవారి ఉత్సవ విగ్రహాని ప్రత్యేక అలంకరణతో గ్రామ పురవీదులగుండా భజనలు చేస్తూ ఊరేగించారు గ్రామస్తులు భక్తిశ్రధ్ధలతో ఉపవాసం ఉండి అమ్మవారికి నైవేద్యం సమర్పించి కుంకుమార్చనలతో పూజలు నిర్వహించి వర్షాలు కురువాలని వేడుక్కునారు.బొమ్మనహల్: ప్రముఖ దేవర నేమకల్లు ఆంజనేయస్వామికి దేవస్థానంలో శ్రావణమాస శనివార ప్రారంభ పూజలు వైభవంగా నిర్వహించారు. శ్రావణమాసంలోని నాలుగు (22, 29, సెప్టంబర్ 5, 12) శనివారాలలో ప్రతేక పూజలు నిర్వహించడం తో పాటు చివరి శనివారం 12వ తేదిన స్వామివారికి పూల రధోత్సవం, 13న ఆదివారం తెల్లవారుజామున స్వామివారికి రధోత్సవం నిర్వహించనున్నట్లు రాయదుర్గం గ్రూప్ దేవాలయ కర్యనిర్వాహక అధికారి, సబ్యులు, ఆలయ ధర్మకర్తలు విజయస్వప్నం.నెట్ ప్రతినిదికి తెలిపారు. స్వామివారి చరిత్ర: శ్రీ కృష్ణ దేవరాయలవారి పరిపాలన కాలంలో రాజుకు కుజదోషం రావడంతో ఆయన స్థానంలో పరిపాలన కొనసాగించిన వ్యాసమహర్షి దేశాటన సందర్భంగా నేమకల్లు ప్రాంతంలో విశ్రాంతి తీసుక్కున్నారు. ఆసమయంలో సమీపంలో నాగుపాము పుట్టలోనున్న ఆంజనేయస్వామి ప్రతిమకు ఆవుపాలు ఇవ్వడంతో ఆప్రాంతమహిమను గమనించి ఆలయనిర్మాణం చేపట్టారు. ఈనేపద్యంలో ఒకే నక్షత్రాన నేమకల్లు ఆంజనేయస్వామి విగ్రహప్రతిష్టతో పాటు కసాపురం, మురడి(డి.హిరేహళ్ మండలం)లో ఆంజనేయస్వామి వార్ల విగ్రహాలను ప్రతిష్టించారు. దీనితో అప్పటినుండి నేమకల్లు క్షేత్రం పుణ్య క్షేత్రంగా అభివృద్ది చెందింది. ప్రస్తుతం భక్తుల విరాళాలతోను, దేవాదాయశాఖ నిధులతోను, ధర్మకర్తమండలి సభ్యుల సహాయ సహకారాలతోను దేవాలయం అభివృద్ధి చెందుతోందని భక్తులు పేర్కొంటున్నారు. కాగా గుంతకల్లు మండలంలోని కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి డి.హిరేహళ్ మండలంని మురడి ఆంజనేయస్వామి వారుల దేవాలయాలు జిల్లాలోనే ప్రసిద్ధిగాంచాయి. వీటిని క్రీ. శ. 15 వ శతాబ్దంలో వ్యాసరాయలు ఏకకాలంలో ప్రతిష్టించినట్లు ఆలయ చరిత్ర చెబుతుంది. ఈమూడు ఆలయాలను శ్రావణమాసంలోని ఏదైనా శనివారాల్లో లేదా మంగళవారాల్లో ఒకేరోజు సందర్శిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.పాలపాటిదిన్నే ఆంజనేయస్వామి: భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలోని ఎన్నో పవిత్రమైన శ్రీ ఆంజనేయస్వామి వారి మూలవిరాట్లను శిల్పాలు చేసినారు. కానీ శ్రీ పాలపాటి దిన్నే ఆంజనేయస్వామి దేవస్థానంలో శ్రీ స్వామివారు భువినుండి స్వయంగా ఉద్భవించారు. తరువాత స్వామి మూలవిరాట్ను వ్యాసమహర్షుల వారు ఈప్రాంతంలో పర్యటించినప్పుడు ఒకేనిమిషంలో ఒకే ఘడియలో ప్రాణప్రతిష్ఠ చేసారు. ఆరోజు నుండి ఈరోజు వరకు స్వామివారు విరాజిల్లుతున్నారు.శ్రావణమాస మహోత్సవాలు: శ్రీ పాలపాటి దిన్నే ఆంజనేయస్వామి దేవస్థానం నందు ప్రతియేటా శ్రావణమాసంలో ప్రారంభమై నాలుగు శనివారాలలో జరిగే శ్రావణమాస మహోత్సవములు శ్రీ స్వామివారికి అత్యంత ప్రీతికరమైనది. ఈ శ్రావణమాసంలో కర్ణాటక, తమిళనాడు, రాష్ట్ర నలుమూలలనుండి లక్షలాది మంది విచ్చేయుదురు. అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తు౦టారు. అనంతపురం నుండి 105 కి.మి. దూరంలో నల్లచెరువు రైల్వేస్టేసన్ సమీపంలో ఆలయానికి చేరుకోవచ్చును.