15నుండి కసాపురంలో శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి శ్రావణ మాస ఉత్సవాలు 15 ఆగస్టు, శనివారం అనంతపురం - గుంతకల్ - ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం శ్రీనెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో ఈనెల 15నుండి శ్రావణ మాసం ప్రారంభం సంధర్భంగా శ్రావణమాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అందులోభాగంగా ప్రతిశని, మంగళవారాల్లో స్వామి వారిని వివిధ రూపాల్లో ప్రత్యేక వాహనాలపై ఊరేగిస్తారు. ఈసంధర్భంగా శ్రావణమాసం 4వారాల్లో స్వామివారిని దర్శంచుకునేందుకు పరిసర ప్రాంతాల నుండే కాకుండా ఇతరరాష్ట్రాల నుండి కూడా వేలాదిగా భక్తులు తరలిరానున్నారు. ఉత్సవాల్లో భాగంగా 15న మొదటి శనివారం శ్రీసీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామివార్లను శేషవాహనంపై ఊరేగిస్తారు. ఈనెల 22వ తేదీన రెండవ శనివారం గరుడ వాహనం, 29న మూడవ శనివారం ఒంటె వాహనం, నాల్దవ శనివారం గజవాహనం, సెప్టెంబర్ 12వ తేదిన ఐదవ శనివారం హనుమాన్ వాహనం సేవలతో (శ్రావణ మాసం ముగింపు) నిర్వహంచనున్నారు. శ్రావణమాసంలో వచ్చే 4 మంగళవారాల్లో శ్రీనెట్టికంటి ఆంజనేయస్వామి వారిని పల్లకీల్లో ఊరేగించెదరు. 4 వారాల్లో నెట్టికంటి ఆంజనేయస్వామి (కసాపురం), మురడి ఆంజనేయస్వామి, నెమకల్లు ఆంజనేయస్వామి 3 దేవస్ధానాలతో పాటు నల్లచెరువు పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి దేవాలయాలు ఒకేరోజు దర్శించుకుంటే శుభాలు కలుదుతాయని భక్తల విశ్వాసం. RTC ప్రత్యేక బస్సుసౌకర్యంతో ఈదేవాలయాలు దర్శంచవచ్చును. శ్రీనెట్టికంటి ఆంజనేయస్వామి వారిదేవస్ధానం, కసావురం, అనంతపురం(జిల్లా) 08552-226714 మన రాష్ట్రంలోని ప్రముఖ ఆంజనేయ క్షేత్రాలలో కసాపురం ఒకటి. ఈక్షేత్రంలోని స్వామివారు దుష్టగ్రహ బాధలు పోగొట్టి, భక్తుల మనసులోని కోర్కెలు నెరవేర్చతున్నారు. వందల సంవత్సరాల గల ఈక్షేత్రాన్ని ప్రతినిత్యం వేలాదిమంది భక్తులు సందర్శించుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. ముఖ్యంగా ప్రతిశనివారం వేలాది మంది భక్తులు శ్రీస్వామి వారిని దర్శించి, ఇక్కడే నిద్ర చేయడం ఆచారం. అలాగే వైశాఖ, శ్రావణ, కార్తీక, మాఘ మాసారలోని శని వారాలలో భక్తలు దేవస్థానానికి విచ్చేసి, వారి పిల్లలకు పుట్టువెంట్రుకలు తీయించటం, నామకరణం చేయడం కూడా చేస్తారు. దేవస్థానానికి చేరుమార్గాలు గుంతకల్లు నుండి 5 కి.మి, అనంతపురం నుండి 90కి.మి, గత్తి నుండి (NH-7) 32కి.మి దూరంలొ కసాపురం వుంది. గుంతకల్లు - మద్దెకెర రైల్వేస్టేషన్లో దిగి కసాపురంకు ఆర్టీసి బస్సు, ఆటోల ద్వారా చేరుకోవచ్చును. అన్ని ప్రముఖ పట్టణాల నుండి కసాపురానికి ఆర్టీసి బస్సుల సౌకర్యం కలదు. గమనిక - శ్రావణమాసంలో ఆర్టీసి సంస్థ అదనంగా బస్సులు కేటాయించి పలుప్రాంతాల భక్తులకు సౌకర్యం ప్రతియేటా కల్పిస్తున్నారు.