బాదిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి పల్లె 9 ఆగస్టు, ఆదివారం అనంతపురం - ఓబులదేవరచెరువు - మండలంలో కొండకమర్లకు చెందిన మొహితిన్ బాష (58) గత రెండు రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందగా శనివారం రాత్రి ఐటి, సమాచార, మైనారిటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి కుటుంబ సభ్యులు భార్య బీబీ కుమారులను పరమార్శించారు. అనంతరం మామిల్ల కుట్లపల్లికి చెందిన సుహాసిని(17) కరెంటు షాక్ కు గురై గత రెండు నెలల క్రితం మృతి చెందగా, బాదిత తల్లిదండ్రులను ఆదినారాయణ, నర్సమ్మలను, అలాగే వడ్డివారి పల్లె చెందిన రైతు కృష్ణ రెడ్డి గుండె పోటుతో వారం క్రితం మృతి చెందగా ఆకుటుంబంలో బార్య రమణమ్మ కుమారులు మల్లికార్జున రెడ్డిలను, దొన్నికోటవారి పల్లెకి చెందిన విద్యార్థి మధువర్ధన్ రెడ్డి ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబంలో తల్లిదండ్రులు ఆనంద్ రెడ్డి కమలమ్మలను కూడా పరమార్శించారు. బాదిత కుటుంబాలకు ప్రభుత్వం నుండి ఆర్ధిక సహాయం అందిస్తామన్నారు.మంత్రి వెంట జెడ్.పి.టి.సి, సిద్ద ఓబులరెడ్డి, ఎం.పి.పి ఇస్మాయిల్, మండల కన్వీనేర్ రామానాయుడు, నాయకులు రామప్ప నాయుడు, సిద్ద చలపతి నాయుడు, అల్లా బక్షు, రామాంజనేయులు, సూరి, ఆదినారాయణ, సర్పంచ్ నాగిరెడ్డి, షఫీ, నర్సిరెడ్డి, నిజాం తదితరులు పాల్గొన్నారు.