బి.సి మహా సమ్మేళన సభను విజయవంతం చేయాలి 2 ఆగస్టు, ఆదివారం అనంతపురం - ఓబులదేవరచెరువు - S.C, S.T, B.C మైనారిటీల సంక్షేమంకోసం ఆరు దశాబ్దాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రభుత్వపాలనలో అభివృధి పై శ్రద్ద చూపలేదని రాష్ట్ర B.C, O.B.C ఉద్యోగుల సంక్షేమసంఘం అధ్యక్షులు అమ్పావతిని గోవిందు పేర్కొన్నారు. ఆదివారం ఆయన మండల కేంద్రంలో అభయాంజనేయ స్వామి ఆలయంవద్ద మండల బి.సి సంఘాల నాయకుల సమీక్షలో ఈ నెల 9న బి.సిల "మహా సమ్మేళన సభ" పోస్టర్లను విడుదల చేసారు. అనంతరం మాట్లాడుతూ బి.సిలకు ప్రభుత్వాలు మొండిచేయి చూపుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల ముందు, టి.డి.పి అధికారంలోకి వస్తే కేంద్రంలో బి.జె.పితో పోరాడి రాష్ట్రంలో బి.సి సంక్షేమానికి ప్రత్యేక ప్యాకేజి సంక్షేమ నిధులతో అభివృద్ధి చేయిస్తానని, అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా సి.ఎం చంద్రబాబు నాయుడు బి.సిల ఓట్లతో గెలిచి హామీలను మరిచాడని విమర్శించారు. ప్రధాన ప్రతిపక్షం YSR అధినేత YS జగన్ బి.సిల పక్షాన కనీసం గోరంతైన మాట్లాడకపోవడంతో బి.సిలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. కేంద్రప్రభుత్వంతో బి.సిల పక్షాన వుంది పోరాటాలు చేయాల్సిన కాంగ్రెస్, CPM,CPI లు దృష్టి సారించలేదని విమర్శించారు. బి.సిలు రాజ్యాధికారం సాధించాలని, అభివృద్ధి దిశగా సాగిపోవాలనే ఉద్దేశ్యంతో బి.సి సమ్మేళన సభ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 9వ తేది కదిరి పట్టణంలో బాలికల కళాశాలలో బి.సి సభకు SC, ST,BC, మైనారిటీ వర్గాల నాయకులు, ఉద్యోగులు, మేధావులు, విద్యార్థులు, యువకులు, మహిళలు, అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి సినీ నటుడు సుమన్, వివిధ పార్టీల బి.సి MLA లు, MLC లు MP లు సర్పంచులు, MPTC లు, మాజీ శాసన పార్లమెంటు సభ్యులు ఉన్నతాధికారులు రామచంద్ర, రవీందర్ నాయుడు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.