కళాశాల యాజమాన్య నిర్లక్ష్య వైఖరికి విద్యార్థి బలి 1 ఆగస్టు, శనివారం మృతుడు విద్యార్ధి మధువర్ధన్ రెడ్డిఅనంతపురం - ఓబులదేవరచెరువు - పదవ తరగతిలో (10/10) ఉత్తమ ఫలితాలు సాధించిన కుమారుడిని నాణ్యమైన విద్యనందిస్తుందన్న విశ్వాసంతో నెల్లూరు జిల్లాలో ప్రైవేటు కళాశాలలో చేర్పించగా యాజమాన్య నిర్లక్ష్య వైఖరికి మనస్తాపం చెందిన విద్యార్థి కే.మధువర్ధన్ రెడ్డి (17) గురువారం అర్దరాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలం లో చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల మేరకు మండల పరిధిలోని దోన్నికోటవారి పల్లె గ్రామానికి చెందిన మైరాడా సంస్థ గ్రామ చైర్మన్ ఆనందరెడ్డి రెండవ కుమారుడు కే.మధువర్ధన్ రెడ్డి మండల కేంద్రంలోని జీవనజ్యోతి పాఠశాలలొ పదవ తరగతి పరీక్షల్లో ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఉన్నత చదువుల కొరకు నెల్లూరు జిల్లా కేంద్ర సమీపంలో పిదతపోగులూరు వద్ద శ్రీ గాయత్రి విద్యా సంస్థలో జూనియర్ ఇంటర్లో ఈ నెల 1న చేర్పించగా 11వ తేది కళాశాల సీనియర్ ఇంటర్ విద్యార్థులు రాత్రి వేళలో దాడి చేయగా కళాశాల యాజమాన్యంకు ఫిర్యాదు చేసి స్వగ్రామానికి వచ్చి దాడి చేసిన విషయం తల్లిదండ్రులకు తెలిపారన్నారు. ఈ నెల 24న తల్లిదండ్రులు నెల్లూరులో కళాశాలకు కుమారుడితో వెళ్లి యాజమాన్యంతో చర్చించగా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విద్యార్ధి మధువర్ధన్ కళాశాలకు చేరానని స్వగ్రామానికి తిరిగి వచ్చినట్లు తెలిపారు. 30న (గురువారం) మధ్యాహ్నం కళాశాల నుండి తండ్రికి ఫోన్ చేసి మాట్లాడగా, కుమారుడు మధువర్ధాన్ ఇష్టపూర్వకంగా కళాశాలకు చేరితే పంపుతామని ఖరాఖండిగా చెప్పామన్నారు. పెద్దకుమారుడు ఉదయ్ రెడ్డి హైదరాబాద్ లో బి.టెక్ చదువుతున్నందున అక్కడికి వెళ్లి చదువుకుంటానని చెప్పి రాత్రి బయలుదేరి గ్రామ సమీపంలో స్వంత బోరు బావి వద్దకు వెళ్లి మామిడి తోటలో మామిడి చెట్టుకు వురివేసుకున్నట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం గ్రామస్థులు బహుర్భూమికి వెళ్ళగా ఉరివేసుకున్న విద్యార్థిని చూసి తల్లితండ్రులకు సమాచారం అందించినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న తహశీల్దారు మోహన్ దాస్, కదిరి పట్టాన డి.ఎస్.ఫై. రామాంజనేయులు, నల్లమాడ సి.ఐ. రవీందర్నాథ్ రెడ్డి, ఎస్.ఐ. మధుసుధన్ రెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి కేసు నమోడుచేసుకొని పోస్ట్ మాటం నిమిత్తం మృత దేహాన్ని కదిరి ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న డి.ఎస్.పి రామాంజనేయులు, సి.ఐ, ఎస్.ఐలు విద్యార్థిని రిశితేస్వరి మృతికి కారకులైన వారిని శిక్షించాలి (sc, st ) గుంటూరు జిల్లా నాగార్జున విస్వవిధ్యాలంలో ఈనెల పద్నాలుగున రాగింగ్ కి గురై విద్యార్థిని రిశితేస్వరి ఆత్మహత్య చేసుకోగా కారకులైన వారిని శిక్షించాలంటూ శుక్రవారం పుట్టపర్తి నియోజకవర్గ SC, ST, BC మైనారిటీ ఐక్యవేదిక అధ్యక్షులు ఆనంద్ నాయక్ ఆధ్వర్యం లో మండల కేంద్రంలో విజ్ఞాన్ B.ed కళాశాల విద్యార్థులు బారీ ర్యాలి నిర్వహించారు. అనంతరం తహశీల్దారు కార్యాలయం ముందు పెద్ద ఎత్తున కళాశాల ప్రిన్సిపాల్ ర్యాగింగ్ పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని నినాదాలు చేసారు. లేని పక్షం లో ఉద్యమాలు మరింత ఝటిలంగ ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బాలాజీ నాయక్ పాల్గొని మాట్లాడుతూ ర్యాగింగ్ కి గురైన విద్యార్ధిని రిశితేస్వరి మృతికి కారకులైన వారిని శిక్షించాలని రాష్ట్రవ్యాప్తంగా అన్నివర్గాల ప్రజలనుండి పెద్ద ఎత్తున నిరసనలు గళం విప్పుతున్నప్పటికి, ప్రభుత్వానికి చీమకుట్టినట్టైన లేదన్నారు. అనంతరం నిందితులని శిక్షించాలని డిమాండ్ చేస్తూ డి.టి. మహబూబ్ బాష కి వినతిపత్రం అందజేశారు. కమిటీ సభ్యులు ఇంతియాజ్, బాల నాయక్, బాషా, రాజశేఖర్ యాదవ్, చంద్రనయాక్ తదితరులు పాల్గొన్నారు.తహశీల్దారు కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న విద్యార్థి, విధ్యర్తినీలు