నామ మాత్రంగా మండలమీట్ అధికార,ప్రతిపక్ష ఎం.పి.టీ.సీ లు గైర్హాజరు 14 జూలై, మంగళవారం అనంతపురం - ఓబులదేవరచెరువు - మండల అభివృధి కార్యాలయంలో 4వ మండల సమావేశము మంగళవారం ఎం.పి.పి ఇస్మాయిల్ అధ్యక్షత నిర్వహించగా అధికార, ప్రతిపక్ష పార్టీల ఎం.పీ.టీ.సీలు గైర్హాజరయ్యారు. ఈ.ఓ.ఆర్.డి నజీర్, డిప్యుటీ తహశిల్దార్ మహబూబ్ ఫీరాలు పాల్గొనగా వివిధ శాఖాధికారులు హాజరై ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలపై వివరించారు. టి.కుంట్లపల్లి ఎం.పీ.టీ.సీ శంకర్ నాయుడు మాట్లాడుతూ .. బిస్కెట్లు, టీలు తాగి పోవడానికే మండల సమావేశాలు పరిమితముతున్నయన్నారు. గత మండల సమావేశాల్లో తీర్మానాలు, ఆమోదాలు నిధుల కేటాయింపులు చర్చలవరకే నిలిచిపోయయన్నాను. అనంతరం అల్లాపల్లి సర్పంచ్ రంగారెడ్డి మాట్లాడుతూ. విషజ్వరాలు, మలేరియా, టైఫాయిడ్, డెంగీ వంటి ప్రమాదకర వ్యాధులతో గ్రామీణులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు హెల్త్ క్యాంపుల ద్వారా అవగాహన కల్పించి ప్రధమ చికిత్సలు అందించాలని కోరారు. టీ.కుంట్లపల్లి గ్రామంలో రాత్రివేళలో విద్యుత్తు సరఫరా నిలిచిపోతే మరమ్మతులు చేసేందుకు సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, బిల్లులు అధికంగా చెల్లిస్తున్నారని టీ.కుంట్లపల్లి ఎం.పి.టి.సీ శంకర్ నాయుడు ఆవేదన చెందారు.టీ.కుంట్లపల్లి ఉన్నత పాఠశాలలో వంటగాదితో పాటు 5 అదనపు తరగతి గదులు నిర్మించాలని కోరారు. అయితే అధికార పార్టీకి చెందిన నలుగురు, ప్రతిపక్ష ysr పార్టీ ఎం.పి.టి.సీలు నలుగురు గైర్హాజరయ్యారు. ముగ్గురు టి.డి.పి. ఎం.పి.టి.సీలు, ఇద్దరు వై.ఎస్.ఆర్. ఎం.పి.టి.సీలు హాజరయ్యారు. నామమాత్రం గా గంట కూడా మండల మీట్ నిర్వహించలేదని పలువురు చర్చించు కున్నారు.గైర్హాజరితో ఖాళీగా ఉన్న కేటాయించిన కుర్చీలు రాహుల్ పర్యటనను అడ్డుకుంటే గుణపాఠమే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఈ నెల 24న ఓ.డి.చెరువు, నల్లమాడ మండలాల్లో పర్యటనలూ భాగంగా అనంతపురం పార్లమెంట్ సభ్యులు జే.సి.దివాకర్ రెడ్డి అడ్డుకుంటే తగిన బుడ్డి చెబుతామని జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మణిగె మనోహర్ నాయుడు "విజయస్వప్నం.నెట్ " ప్రతినిధితో అన్నారు. రాష్ట్రంలోనే కరువు జిల్లాల్లో మారుమూలగ్రామీన ప్రజలు, రైతుల సమస్యలను పాదయాత్ర ద్వారా స్వయంగా తెలుసుకొనేందుకు రాహుల్ పర్యతిస్తుంటే జే.సి. దివాకర్ రెడ్డి అంతరాయం కల్గిస్తామనడం దిగజారుడు రాజకీయమన్నారు. పర్లమ్మెంటు రాహుల్ జిల్లా సమస్యలపై చర్చిస్తే పరిష్కరించేందుకు ముందుకు రావాలని ఆయన హితవు పలికారు. సంతకేలితే... సెల్ ఫోన్ హుస్ కాకి ఓ.డి.చెరువు మండల కేంద్రంలో ప్రతి భుదవారం సంతా యధాప్రకారం నిర్వహించడం తెలిసిందే. అయితే గత కొద్దినెలలుగా సంతకు నిత్యావసర సరుకులుకు వెళ్ళిన వ్యక్తుల సెల్ ఫోన్లు గుర్తు తెలియని వ్యక్తులు దొంగాలిస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నట్లు సమాచారం. ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తులు చోరిలకి పాల్పడుతున్నారా..? బయటివ్యక్తులు సంతరోజుల్లో సెల్ ఫోన్లు తస్కరించే అసాంఘిక కార్యక్రమ్మలకు పాల్పడుతున్నారా ..? పలువురు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఇదిలా వుండగా సాక్షి విలేకరి, ఐ.కే.పి ఏ.పి.ఎం. రవీంద్ర విలువైన సెల్ ఫోన్లు చోరీకి గురి కావడంతో పోలిసుల దృష్టికి తీసుకేల్లినట్లు సమాచారం. సాదారణ ప్రజానీకం చెందిన ఫోన్లు చోరి అయిన తెలియచేయలేకపోతున్నారు.