దేవాలయంలో మనం ప్రదక్షిణలు ఎందుకు చేస్తాము 2 ప్రదక్షిణలు వాటి ప్రాముఖ్యత 11 జూలై, సోమవారం - భక్తి-ఆరోగ్యం - మనం ఒక కేంద్ర బిందువు సాయంతో వృత్తాన్ని ఎలాగైతే గీయగలుగూతున్నామో, అలాగనే ఆ పరమాత్మున్ని కూడా కేంద్ర బిందువుగా భావించి మనం ప్రదక్షిణలు చేస్తాము. వృత్తము యొక్క చుట్టుకొలత కేంద్ర బిందువు నుండి సమాన దూరంలో ఉంటుంది, ఆలాగే ప్రదక్షిణలతో మనం ఎవరయినాకాని(కులం, గాప్ప, పేద) పరమాత్ముని సన్నిధిలో నిష్పక్షపాతంగా అందరూ సమానమే అని అర్థం. పురాణాలలో ప్రదక్షిణలు యొక్క ప్రాముఖ్యత గురించి చాలా గొప్పగా తాలుపబడింది. ఒకసారి శివుడు తన ఇద్దరు కుమారులను వినాయకుడు మరియు సుబ్రహ్మణ్యస్వామిని ప్రాపంచిక అనుభవం కొరకు ఒకసారి విశ్వ పర్యటన చేయమని అడుగగా వెంటనే సుబ్రహ్మణ్యస్వామి తన నెమలిపై ప్రపంచ పర్యటనకు వెళ్లాడు. కానీ వినాయకుడు మాత్రం తన తల్లితండ్రులను ప్రదక్షిణలు చేసి "లోకము మీరే అయినప్పుడు మిమ్ములను ప్రదక్షిణ చేసినచో ప్రపంచం చుట్టుకొని రావడంతో సమానము కదా" అని వివరించాడు. శయన ప్రదక్షిణలు లేదా అంగ ప్రదక్షిణలు శయన ప్రదక్షిణలు గర్భగుడిలో సాష్టాంగ నమస్కారంతో మోదలవుతుంది. సాష్టాంగ నమస్కారంలో మన శరీరంలోని ఎనిమిది భాగములు నుదిరు, ఛాతీ, భుజాలు, చేతులు మరియు మోకాలు నేలను తాకి నమస్కరించిన చేతులు దేవుని ప్రతిరూపం వైపు ఉంటాయి. ఈ సాష్టాంగ నమస్కార భంగిమలో భక్తులు దొర్లుతూ గర్భగుడిచుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇందుకు ప్రదక్షిణలు చేయటానికి బంధువులు మరియు స్నేహితుల సహాయం చేస్తారు. శయన ప్రదక్షిణ చేయడం అనేది ఒక కఠినమైన సంప్రదాయం. వివిధ వేద మంత్రాలతో పరమాత్మున్ని ఆత్మ ప్రదక్షిణ, భాహ్య ప్రదక్షిణ చయడం అని శయన ప్రదక్షిణం సూచించబడింది. ఆత్మ ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు? పూజలు ముగింపులో తన చుట్టూ తానే మూడు సార్లు ప్రదక్షణ చేయడాన్నే ఆత్మ ప్రదక్షిణ అంటారు. మనలోని పరమాత్మున్ని నమస్కరిస్తూ, మరియు మనలో సంచరిస్తున్న లెక్కలేనటువంచి గ్రహములతో కలిపి శరీరం, మనసు ఒకటిగా భావించి ఏకాగ్రతతో వేద మంత్రం జపిస్తూ మన చుట్టూ మనం తిరగడమే ఆత్మ ప్రదక్షిణ. "యాని కానిచ పాపాని జన్మాన్తర కృతాని ఛ, తాని తాని వినశ్యంతి ప్రదక్షిణ పదే పదే" ఈ జన్మలో కాని, ముందు జన్మలో కాని చేసిన ఖర్మల వల్ల సంక్రమించిన బాధలనుండి ప్రతి ప్రదక్షిణలుతో నశించుగాక అని అర్థం. << Previous